Skip to main content

5 July 2017

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. కాని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు 4000 మంది సైనికులను చంపివేశారు.

అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు-"షిలోహులో ఉన్న యెహోవా మందసాన్ని ఇక్కడికి తెప్పిద్దాం. అది మన మధ్య ఉంటే అది మనల్ని శత్రువుల బారినుంచి కాపాడుతుంది”

యెహోవా మందసం యుద్ధ శిబిరంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులంతా సంతోషంతో పెద్దగా కేకలు వేశారు. ఆ సంగతి త
ెలుసుకొని ఫిలిష్తీయులకు భయం వేసింది.

ఐనా ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయగా, ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఒక్కొక్కరుగా తమ డేరాలకు పారిపోయారు. యుద్ధంలో పెద్ద వధ జరిగింది. 30,000 మంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. దేవుని మందసం చెర పట్టబడింది.(1సమూ 4:1-11)


ఇదే దేవుని మందసంతో వారి పితరులు అనేక యుద్ధాలు చేసి వీరోచితంగా గెలిచారు. దేవుని సన్నిధి వారితో రాగా, ఆయనే వారి పక్షాన పోరాడాడు. అసాధారణ కార్యాలు జరిగించాడు.

కాని విశ్వాసంతో ఉన్న వీరు ఇప్పుడెందుకు ఇలా ఓడిపోయ్యారు?
వీరి పితరులు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు పంపగా యుద్ధానికి వెళ్లేవారు. ఇక్కడ పెద్దల పెత్తనం, వారి మాట దేవుని స్థానాన్ని ఆక్రమించింది. వారి పెద్దలు మతసంభంధంగా ఆలోచిస్తున్నారు, కాని దేవునిపై ఆధారపడినవారు కాదు. పూర్వికులు తయారు చేసిన మందసం వారితో ఉంది కాని పూర్వికులను నడిపిన దేవుడు వారితో లేడు. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కాని దానిలోని దేవుణ్ని తెలుసుకున్నవారు కారు. పితరులు అనుసరించిన విధానాలు, అనుభవాలు పూర్తిగా మారిపోయ్యాయి. వారు ఇతర దేవతలను పూజించట్లేదు కాని నిజ దేవుణ్ని అనుసరించాల్సిన విధానానికి మనసు ఇచ్చినవారు కాదు. కాబట్టే శక్తిగల మందసం తమతో ఉన్నా, ఆ శక్తి ప్రభావం వారితో లేదు (1సమూ 5).

నేడు అందరి చేతిలోని బైబిల్ ఒక్కటే! కానీ భక్తి ఒక్కటి కానట్లే,
స్వచ్ఛత(సరైన సిద్దాంతాలు) చేతిలో ఉన్నంత మాత్రాన, దాని ప్రభావం అనుభవిస్తున్నవారము కాకపోవచ్చు. పితరులు ఇచ్చినవి వారు అనుభవించి, దేవునితో నడచి ఇచ్చినవి. నేడు అవి ధ్యానించి, భోధించడానికే పరిమితమౌతున్నాయి కాని వారి జీవిత అనుభవాలు, వారి భక్తి తీవ్రత ఏమాత్రం మనలో ఉన్నవి కావు.

మందసం చూసి కేకలు వేసి సంబరపడి మనుష్యుల ముందు డాంబికాలు పలకొచ్చేమో, కాని దేవుని ముందు కాదు. భక్తి దైవశక్తిగా మార్చబడడాల్సివుంది. వాక్యము దేవునిది కనుక మనం అవిధేయులుగా ఉన్నా దానికి శక్తి ఉంటుంది కనుక ఇతరుల జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. జీవజల ఊటలు మనలో నుండి కాక మనపై నుండి వెళ్తే ఏమి ప్రయోజనము. మనం వట్టి వారిగా మిగిలిపోతాము(సంఖ్యా 20:10,12)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...