❇ ఆయన యెరూషలేంకు ప్రయాణమై గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. అక్కడ పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని౼"యేసు ప్రభూ! మాపై దయచూపు" అని గట్టిగా కేకలు వేసారు. ఆయన వారిని చూసి౼"మీరు వెళ్లి, యాజకులకు కనపడండి" అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా, దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.అతను సమరయ జాతివాడు. అందుకు యేసు౼"పది మంది శుద్ధులయ్యారు కదా! మిగతా తొమ్మిది మంది ఎక్కడ? ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?" అన్నాడు. ఆ తర్వాత అతనితో౼"నువ్వు లేచి వెళ్ళు! నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని చెప్పాడు. ❇ ■ పదిమంది కుష్ఠురోగులు యేసును వేడుకున్నప్పుడూ.. స్వస్థత పొందినప్పుడూ.. వారిని గూర్చి ఒక గుంపుగానే చెప్పబడింది. వారు బాగుపడిన తర్వాత, మిగితా వారికి భిన్నంగా ఒక్కడు ప్రవర్తించాడు.వాడు యూదుల చేత హీనంగా ఎంచబడే(అధమ జాతి) సమరయుడు. వాడు బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.