సువార్త నిమిత్తం ఖైదీగా ఉన్న పౌలు తన వాదనను కైసరు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని కోరాడు. కాబట్టి పౌలుతో పాటు మరికొందరు ఖైదీలను తీసుకొని శతాధిపతి ఓడలో ఇటలీకి ప్రయణమయ్యాడు. కానీ గొప్ప తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఓడ కొట్టుకొని పోయి 'మెలితే' అనే ఒక ద్వీపం దగ్గరకు వచ్చింది. అనాగరికులైన ద్వీపవాసులు వారికి ఎంతో సహాయపడ్డారు. వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టారు. అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు . 🔹 (అ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.