❇ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు(మతనిష్ఠ గలవాడు), ఇంకొకడు (అన్యాయంగా) పన్నులు వసూలు చేసేవాడు. పరిసయ్యుడు నిలబడి౼"దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అని తనలో తాను ప్రార్థన చేశాడు. ఐతే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాల్లేదు. వాడు గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో౼"దేవా, పాపినైన నన్ను కరుణించు! " అన్నాడు. పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ❇ ■ పరిసయ్యుడు బాహ్యంగా ఎంతో నీతిమంతునిగా కనిపిస్తున్నాడు. పరులవి ఏమీ ఆశించక, ఆధ్యాత్మిక చింతన(భక్తి) కలిగి జీవిస్తున్నాడు. వారానికి రెండుసార్లు ఉపవాసం, సంపాదనలో పదో వంతు దేవునికి ఇస్తూ, నైతిక విలువలతో ఆలయంలో ఎంతో భక్తిపరునిగా, ఎందరికో మాదిరిగా ఉన్నాడు. ఇతని ప్రార్ధనను బట్టి చూస్తే చెడు మార్గాలకు పోని జీవన...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.