(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు..) ● ఏదెను తోటలో మానవుని స్వచిత్తం దేవుని ఆజ్ఞాతిక్రమానికి దారితీసి, తద్వారా మానవుని పతనం జరిగింది. పాపంకు మూలకారణం 'స్వచిత్తం'.క్రీస్తు ఆ పాపానికి క్రయధనం చెల్లించాడు. యేసు౼"అనుదినం నీ సిలువ నెత్తుకొని వెంబడించండి" అని చెప్పాడు.'నీ సిలువ నెత్తుకొని వెంబడించు' అంటే౼నీ స్వేచ్చా పూర్వకమైన స్వంత ఏలుబడికి ఇష్టపడక, దేవుని ఏలుబడి క్రింద అనుదినం జీవిచడం. ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలి అని అనుదినం తీర్మానించు కోవడం. ఇది కూడా విశ్వాసుల స్వేచ్ఛపై ఆధారపడివుంది. పౌలులో క్రీస్తు స్వభావం స్పష్టంగా ఎందుకు కనిపిస్తుంది?మరి మనలో ఎందుకు అంత స్పష్టత లేదు..పౌలు తన జీవితంలో స్వచిత్తానికి సిలువ వేశాడు. మన జీవితాల్లో అది జరగట్లేదు. కనుకనే ఇంకా పాత పురుషుడే కొన్ని విషయాల్లో ఏలుతున్నాడు. విశ్వాసిలో ఈ కార్యం మునుపు జరిగి తిరిగి లోకసంభధమైన జీవితానికి అవకాశం ఉంది(హెబ్రీ 3:12, రోమా 8:13). పౌలు ఆత్మీయ ఎదుగుదలను దేహంతో(పసిబిడ్డలాగా, ఎదిగిన వారిగా) పోల్చాడు(హెబ్రీ 5:13).శిశువు పాలు త్రాగుతూ దినదినం ఎలా ఎదుగుతాడో(రోజు కొంత మార్పు జరుగుత...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.