Skip to main content

Posts

Showing posts from March 12, 2018

12Mar2018

శోధన: ■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలిగించడానికి సాతాను పన్నే వల. సహజంగా మనం దేవుణ్ని తెలిసికొనక మునుపు ఏ పాపాలను ఇష్టంగా చేస్తామో..ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వం మనకు ఉన్న దురాశలను అనుసరించి నడుచుకొనునట్లుగా ప్రేరేపిస్తాడు (ఎఫె 4:22, తీతు 3:3). 'శోధన' అనేది ప్రతి విశ్వాసికీ సహజంగా కలిగే అనుభవమే! ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనం భరింపదగిన దాని కంటే-అనగా మన శక్తికి మించిన శోధనా బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు(1కోరింథి 10:13). ఇందులో దేవుని ఉద్దేశ్యం మనల్ని మరింత బలవంతులుగా చెయ్యాలనే కానీ పాపంలో పడటం ఆయన చిత్తం కాదు! 'శోధించబడటం'(పాపపు ప్రేరణ రావటం) తప్పు కాదు, కాని ఆ ప్రేరణకు లొంగి ఆ పాపంలో పడి అపవాదితో ఏకీభవించడం 'పాపం'. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలం తోడౌతుంది. ■ ఒకవేళ మనం శోధనలో పడినప్పుడు, వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగివేసుకోవాలి(1యోహా 2:1). బలహీనతలను (పుర్వపు పాపాలను) చులకనగా తీ...

08Mar2018

❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు..... ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇ ■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని...

05Mar2018

❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇ ■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్...

03Mar2018

❇ యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి-“నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు. “కాదు! యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి౼“ప్రభూ! తమ దాసుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు. యెహోవా సైన్యాధిపతి యెహోషువతో౼“నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు ❇ దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు? ■ దేవుని సర్వ సైన్యాలు(దేవదూతలు) తమకు నచ్చిన పని తాము చేసుకుపోరు గాని దేవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ఏం చెప్తే అదే చేశారు. కొద్దివారికేమి, గొప్పవారికేమి దేవుడు చెప్పమన్న వార్తను మోసుకుపోయ్యారు, దేవుని ప్రజలకు సహాయకులుగా నిలిచారు. యుద్దాలు చేశారు, రక్షకులుగా నిలిచారు, ఓదార్చారు-బలపర్చారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐతే వారు దేవుడు సెలవివ్వకుండా ఏ ఒక్క పని చెయ్యరు. ఆ విధంగా వారు దేవుని పక్షం ఉన్నారు కనుకనే దేవుడు వారి...