Skip to main content

05Mar2018


❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు.
యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇


■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్రహించాలి. క్రీస్తు ఈ లోకానికి రావడం వెనుక ఉదేశ్యం అద్భుతాలు, అనారోగ్యాలు బాగుచేయడం కోసమా? కాదు గాని, మన పాపాల నుండి మనల్ని విమోచించి, చెడిపోయిన దైవ-మానవ సంభంధాన్ని తిరిగి బాగుచేసి, ఆయనకు ప్రియ బిడ్డలుగా చేయడానికే రక్షకునిగా వచ్చాడు. దేవుడు పంపే ప్రతి భాధ కన్నీరు వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అవన్నీ నిన్ను దేవుడు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మార్గాలు. దాని బట్టి ఒంటరిగా, నిస్సహాయునిగా నీవు కుమిలిపోతుంటే అవి అనుమతించిన దేవుడు కూడా కుమిలిపోతాడు (క్రీస్తులో దేవుని స్వాభావాన్ని స్పష్టంగా చూడొచ్చు). ఐతే దానిలో నీకు నిత్యమేలు దాగివుంటుంది. ఆ తాత్కాలిక భాధ కంటే, తర్వాత పొందే ఆత్మీయ దీవెనే నీకు ఎక్కువ మేలు చేస్తుంది కనుక అనుమతిస్తాడు.

■ ఇక్కడ క్రీస్తు జరిగించిన అసాధారణ అద్భుతం ద్వారా, ఆయన ఎవరో పరమ తండ్రి సాక్ష్యం పలుకుతున్నాడు. ఆయన్ను విశ్వసించి, ఆయన మాట వినాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఆ రక్షకుడైన క్రీస్తును ఆశ్రయించి ఆయన ప్రకటించే దేవుని రాజ్యానికి వారసులవ్వాలని దేవుని వాంఛ. ఆమె ఇంటివారే కాదు, ఆ ఊరి వారు, ఆ మాటలు విన్నవారు, ఆ సంఘటన గూర్చి విన్న ప్రతి తరం వారు క్రీస్తులో తమ రక్షకుణ్ని చూడాలని దేవుడు ఆశించాడు. మనం పొందే తాత్కాలిక భాధ కంటే ఈ దీవెన ఎంత గొప్పది. ప్రతి సూచక క్రియ౼మనకు క్రీస్తు దైవత్వాన్ని, దేవుని లక్షణాలను, దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంటాయి. అవన్నీ మనం క్రీస్తును పాప విమోచకునిగా కలుసుకోవడానికి దారులని సిద్ధం చేస్తాయి. కొందరు అద్భుతాలు, స్వస్థతల వద్దే ఆగిపోతారు. అందుకోసమే వెంబడిస్తారు. తమ సొంత ఆత్మలను, రక్షణను నిర్లక్ష్యం చేసి నశించిపోతారు. భూసంభందమైన క్రైస్తవత్వం. అది నకిలీ క్రైస్తవత్వం. అది బోధించే వారు నేడు అనేకులు. క్రీస్తును పాప విమోచకునిగా, తమ సొంత రక్షకునిగా అంగికరించి, పాత జీవితాన్ని విడిచి క్రీస్తును హత్తుకున్నప్పుడే నీవు నిజ క్రైస్తవుడవు. ఆత్మ రూపాంతరం చెందకుండా (మారుమనస్సు లేకుండా) ఎవ్వడూ క్రైస్తవుడు కాలేడు. అందుకోసమే ప్రభువు ఈ లోకానికి వచ్చి, మరణించి-తిరిగి లేచాడు.

౼ఒకవేళ ఇప్పటికే ఆయన ద్వారా నీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు జరిగించి ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు క్రీస్తును నీ వ్యక్తిగత జీవితంపై అధికారం కలిగి, పరిపాలించే ప్రభువుగా నిలుపుకోకపోతే ఇప్పుడే ఆ తీర్మానం చేసుకో! నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి, ప్రభువును హృదయపూర్వకంగా నీకు రక్షకునిగా నిలుపుకుని, క్రీస్తులో క్రొత్తగా పుట్టు. అప్పుడు పాతజీవితం గతిస్తుంది! అంతా క్రొత్తవిగా మారతాయి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...