❇ ఆదిలో దేవుడు భూమి, ఆకాశాలనూ సృజించాడు. అప్పుడు భూమి మొత్తం శూన్యంగా, రూపం లేకుండా ఉంది. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ళపై సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు౼“వెలుగు కలుగును గాక!” అనగానే, వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు. అది చక్కగా ఉన్నట్లు ఆయన చూసాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును, చీకటి నుండి 'వేరు' చేసాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు ❇ ■ దేవుడు సృష్టి నిర్మాణం అంతటిని ఆరు రోజుల్లో ముగించాడు. ఆదిలో ఖాళీగా, ఆకారం లేకుండా ఉన్న భూమిని దేవుడు తన ఆలోచనల్లోని రూపంతో నింపాలని కోరుకున్నాడు. ఆయన మాట పలుకగా, తన ఆత్మ ద్వారా నూతన నిర్మాణం జరిగింది. దినదినం ఆయన కోరుకున్న రూపంలోకి మార్పు చెందుతూ వచ్చింది.నేడు ఏ మాత్రం నిరీక్షణ లేని (శూన్యంగా, రూపంలేకుండా ఉన్న) జీవితాలపై దేవుడు పని చేయడానికి ఇష్టపడతాడు (మానవులందరి జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు). ■ నేర్పరియైన శిల్పి ఆకృతి లేని రాయిలో అందమైన రూపాన్ని ముందుగానే తన ఆలోచనల్లో చూచినట్లే...దేవుడు కూడా అస్తవ్యస్తంగా, ని...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.