★ i) క్రూరుడు, క్రీస్తు సంఘాన్ని హింసించిన సౌలు(పౌలు) క్రైస్తవునిగా మారిపోయిన తర్వాత తొలిసారిగా యెరూషలేములో ఉన్న అపొస్తలులను(క్రీస్తు శిష్యులును) కలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతడు మారిపోయ్యాడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. ఐతే "బర్నబా" అతనిని చేరదీసి, అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి వారికి పరిచయం చేశాడు (అ.కా 9:26-29). కొన్ని సంవత్సరాల తర్వాత.. ii) పౌలు బర్నబాతో౼ "మనం ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో, ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దాము" అన్నాడు. మునుపు తమతో రాకుండా మధ్యలో విడిచి వెళ్ళిపోయిన మార్కును వెంట బెట్టుకొని పోవడం భావ్యం కాదని పౌలు తలంచాడు. ఐతే అతణ్ని వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు (అ.కా 15:36-41). iii) పౌలు-"పేతురు (క్రీస్తు శిష్యులలో ముఖ్యుడు) అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. అతడు అన్యులతో(యూదులు కాని వారితో) భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యూదులు రాగానే వా...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.