Skip to main content

Posts

Showing posts from October 9, 2017

07Oct2017

❇ యేసు ఒక కథ చెప్పాడు–"తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది. ఆ రైతు పనివాళ్ళు నిద్రపోతూ ఉంటే, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి . అప్పుడు పనివాళ్ళు ఆ రైతు దగ్గరికి వచ్చి౼"అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా! అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు. "ఇది పగవాడు చేసిన పని!" అని అతడు వారితో అన్నాడు. పనివాళ్ళు౼"మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయ మంటారా?" అని అతన్ని అడిగారు. అందుకా రైతు౼"వద్దు! కలుపు మొక్కల్ని పీకివేసేటప్పుడు, వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో..కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో 'ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చి వేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి' అని కోత కోసే వారికి చెబుతాను" అన్నాడు ❇ ✔ ప్రతి రైతు తన పొలం నుండి శ్రేష్ఠమైన పంటనే ఆశిస్తాడు. దేవుడు ఈ లోకమనే పొలంను శ్రేష్ఠమైన వాటితో నింపాడు. ఆయన మాటలనే మంచి...

09Oct2017

❇ మన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల మనం చచ్చిన వాళ్ళంగా ఉన్నాము...ఐతే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో ద్వారా బ్రతికించాడు.క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కృప చేతనే మనకు రక్షణ కలుగుతుంది. ఇది మన మంచి పనుల వల్ల కలిగింది కాదు, దేవుడిచ్చిన బహుమానమే! కాబట్టి ఎవరూ దేవుని రక్షణ గూర్చి గొప్పలు చెప్పుకోడానికి వీల్లేదు. ❇ ✔ మనం దేవునితో ఏమాత్రం సంబంధం లేనివారమై, పాపం చేస్తూ ఉన్నాము. దేవునితో ఉన్న ఈ ఎడబాటునే బైబిల్ "ఆత్మలో చచ్చిన స్థితి" అని పిలుస్తుంది. చనిపోయిన వాడు లోకంతో ఉన్న అన్ని సంభంధాలను, అనుబంధాలను కోల్పోతాడు. అలాగే దేవుడు సృష్టించిన సృష్టిలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ దేవుని ఉనికిని, సహవాసాన్ని ఏమాత్రం గుర్తించని వాడిగా ఉంటాడు. కానీ మానవాళి(సృష్టి) అంతా ఆ దేవుని మీదే ఆధారపడి జీవిస్తువుంది. దేవుడు మనిషికి దూరంగా ఉన్నాడా?లేదు..మనమే చచ్చిన స్థితిలో దేవునితో సంభంధం లేక ఉన్నాము. వాయుమండలంలో తిరుగాడే (సాతాను) దైవవిరోధమైన ఆత్మ సృష్టిలో ఉంది. ఎంతో జ్ఞానపూరితమైన ఈ లోకంలో, అత్యంత అసహ్యమైన పనులు జరుగుతూ ఉన్నాయి...