❇ యేసు సిలువ వేయబడక ముందు రాత్రి..భోజన సమయంలో శిష్యులు తమలో 'ఎవరు గొప్ప' అనే వివాదం వారిలో తలెత్తింది. అప్పుడు యేసు౼"ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక వడ్డించే వాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవసాగాడు. యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో౼"నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక మాదిరి చూపించ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.