❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు. అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు.... వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇ ■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి. బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తి...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.