❇ యేసు పునరుద్దారుడైన తర్వాత శిష్యులకు కనిపించాడు. అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వాళ్ళతో లేడు. తోమా వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు౼"మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు. 8 రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి౼" మీకు శాంతి కలుగు గాక!" అని చెప్పి..ఆయన తోమాను చూసి౼"నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు. తోమా ఆయనతో౼"నా ప్రభూ, నా దేవా" అన్నాడు. యేసు౼"నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు ❇ ✔ యేసును సిలువ వేసినప్పుడు, సమాధి చేసినప్పుడు తోమా అక్కడ లేడు. కాని ఆయన పక్కలో పొడిచారని మరొకరు చెప్పినప్పుడు చూడకపోయినా నమ్మాడు(యోహా 19:34, 20:25). కా...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.