'పరలోకానికి వెళ్లాలంటే మనం ఏమి చెయ్యాలి?' అనే అంతుచిక్కని ఆ ప్రశ్నకు సమాధానం కోసం నీకొదేము అనే బోధకుడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు. నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు. యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి" “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు. యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యా...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.