'పరలోకానికి వెళ్లాలంటే మనం ఏమి చెయ్యాలి?' అనే అంతుచిక్కని ఆ ప్రశ్నకు సమాధానం కోసం నీకొదేము అనే బోధకుడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు.
యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.
నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి"
“ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు.
యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన్ను అంగీకరిస్తారు" అని చెప్పాడు.
✔ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో(పరలోకంలో), నిత్యకాలంలో జీవించాలంటే ఖచ్చితంగా ఆయనలాంటి పరిశుద్ధులైతే తప్ప ఎవ్వరూ అక్కడ నివసించలేరు. కాబట్టి మొదట యదార్ధంగా మనం దానికి అర్హులం కాదని గుర్తించాలి.ఈ విషయంలో మన మనసాక్షే మన మీద నేరారోపణ చేస్తుంది. నిస్సాహయులమైన మన మీద దేవుడు తన కరుణను చూపుతున్నాడు. ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి, లోక పాపాన్ని(నీ పాపాన్ని) యేసుపై మోపి, మన (నీ) పాపపు శిక్షను ఆయనకు విధించాడు. ఆయన నీతిని ఉచితంగా మనకు (నీకు) అనుగ్రహించాడు.
✔ ఈ సత్యాన్ని విశ్వసించి, పాపముల విషయమై పశ్చాత్తాపడిన వెంటనే మనం ఆత్మలో క్రొత్త జన్మను పొందుతాము.ఆ క్షణమందే పరలోక తండ్రి బిడ్డలంమౌతాము.మనకు సహాయంగా, మనం ఆయానవారం అనడానికి గుర్తుగా ఆయన ఆత్మ మనలో నివసిస్తాడు, కనుక ఇకను పాప సంభంధులముగా కాకుండా, నీతికి వారసులుగా ఆయన్ను పోలి నడచుకోవాల్సినవారము.ఇక మన జీవితంలో, దేవునితో క్రొత్త ప్రయాణం ఆరంభమౌతుంది.
యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.
నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి"
“ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు.
యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన్ను అంగీకరిస్తారు" అని చెప్పాడు.
✔ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో(పరలోకంలో), నిత్యకాలంలో జీవించాలంటే ఖచ్చితంగా ఆయనలాంటి పరిశుద్ధులైతే తప్ప ఎవ్వరూ అక్కడ నివసించలేరు. కాబట్టి మొదట యదార్ధంగా మనం దానికి అర్హులం కాదని గుర్తించాలి.ఈ విషయంలో మన మనసాక్షే మన మీద నేరారోపణ చేస్తుంది. నిస్సాహయులమైన మన మీద దేవుడు తన కరుణను చూపుతున్నాడు. ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి, లోక పాపాన్ని(నీ పాపాన్ని) యేసుపై మోపి, మన (నీ) పాపపు శిక్షను ఆయనకు విధించాడు. ఆయన నీతిని ఉచితంగా మనకు (నీకు) అనుగ్రహించాడు.
✔ ఈ సత్యాన్ని విశ్వసించి, పాపముల విషయమై పశ్చాత్తాపడిన వెంటనే మనం ఆత్మలో క్రొత్త జన్మను పొందుతాము.ఆ క్షణమందే పరలోక తండ్రి బిడ్డలంమౌతాము.మనకు సహాయంగా, మనం ఆయానవారం అనడానికి గుర్తుగా ఆయన ఆత్మ మనలో నివసిస్తాడు, కనుక ఇకను పాప సంభంధులముగా కాకుండా, నీతికి వారసులుగా ఆయన్ను పోలి నడచుకోవాల్సినవారము.ఇక మన జీవితంలో, దేవునితో క్రొత్త ప్రయాణం ఆరంభమౌతుంది.
Comments
Post a Comment