Skip to main content

Posts

Showing posts from September 18, 2017

18Sep2017

❇ సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి...  ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి ౼"ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో వచ్చాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు." అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు పడ వేశారు (ప్రకటన 4:4,10,11). దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు౼"ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా..."(ప్రకటన 11:16). ❇ ✔ కొన్ని కోట్ల మంది విశ్వాసులు లోకం నుండి వేరై, దేవుని యందు విశ్వాసముంచి దేవుని పక్షంగా నిలిచారు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను ఇరవై నలుగురు పెద్దలను ప్రత్యేకంగా దేవుని సింహాసనం యెదుట చూశాడు. వారు కిరీటాలు ధరించి ఉన్నారు. యోహాను చూసిన ప్రతిసారి ఆ ఇర...