Skip to main content

Posts

Showing posts from October 14, 2017

14Oct2017

❇ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. వారి ముందు ఇశ్రాయేలీయులు నిలువలేక పారిపోయారు.చాలా మంది సైనికులు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. రాజైన సౌలు యొక్క ముగ్గురు కుమారులను అతని కళ్ళ ముందే చంపారు. ఇది చూసి అప్పటికే బాగా గాయపడిన సౌలు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిష్తీయులు సౌలు తలను ఛేదించి దాగోను దేవుడి గుడిలో తగిలించారు. అతని మొండాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఇలా దేవుని చేత అభిషేకించబడిన రాజైన సౌలు జీవితం విషాదంతో ముగిసింది. సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి, దేవుని దృష్టి యెదుట ద్రోహము చేశాడు. అంతేకాకుండా దేవుని దగ్గర కనిపెట్టకుండా కర్ణపిశాచముల సహాయంతో సోదె చెప్పె దానిని వెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కారణాలను బట్టి దేవుడు అతనికి మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను.(1దిన 10) ❇ ✔ ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయులను తరిమి తరిమి చంపారు(1సమూ 17:52). శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన ప్రతిసారీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. కారణం దైవభయం కలిగిన శూరుడైన దావీదు. దేవుని యెదుట సుబుద్ధి కలిగిన ఒక్క వ్యక్తి ప్రభావం, ఆ దేశం అంతటిపైనా కన...