❇ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరే నిప్పు. ఈ విధంగా వారు పాపం చేసారు కనుక యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో౼“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు,’నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి'”. అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు. అప్పుడు అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులను మోషే పిలిపించాడు. వారు మీషాయేలును ఎల్సాఫానును. అతడు వారితో౼“పరిశుద్ధ స్థలం ముందుకు వెళ్లండి. మీ సోదరుల శవాలను పాళెము వెలుపలకు తీసుకొని పొండి” అన్నాడు. అప్పుడు వారు నాదాబు, అబీహు శవాలను పాళెము వెలుపలకు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.(లేవీ 10:1-5) ❇ ■ ధర్మశాస్త్రంలో అదేశించబడిన పనులు రాబోయే క్రీస్తు విమోచన కార్యానికి ముంగుర్తులు. ఎక్కడ దేవుని ప్రత్యక్షత (revelation) ఎక్కువగా ఉంటుందో అక్కడ విధేయత ఎక్కువగా ఎదురు చూడబడుతుంద...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.