Skip to main content

06Dec2017


❇ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరే నిప్పు. ఈ విధంగా వారు పాపం చేసారు కనుక యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు.

అప్పుడు మోషే అహరోనుతో౼“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు,’నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి'”. అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.
అప్పుడు అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులను మోషే పిలిపించాడు. వారు మీషాయేలును ఎల్సాఫానును. అతడు వారితో౼“పరిశుద్ధ స్థలం ముందుకు వెళ్లండి. మీ సోదరుల శవాలను పాళెము వెలుపలకు తీసుకొని పొండి” అన్నాడు. అప్పుడు వారు నాదాబు, అబీహు శవాలను పాళెము వెలుపలకు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.(లేవీ 10:1-5) ❇


■ ధర్మశాస్త్రంలో అదేశించబడిన పనులు రాబోయే క్రీస్తు విమోచన కార్యానికి ముంగుర్తులు. ఎక్కడ దేవుని ప్రత్యక్షత (revelation) ఎక్కువగా ఉంటుందో అక్కడ విధేయత ఎక్కువగా ఎదురు చూడబడుతుంది.నిజానికి ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం ఆవరణంలో ఉన్న బలిపీఠం నిప్పుతోనే ధూపం వేయాలని దేవుడు ఆదేశించాడు(లేవి 16:12). 'బలిపీఠం'౼మానవాళి అంతటి పాప-ప్రక్షాళన నిమిత్తం క్రీస్తు చేసిన బలియాగాయానికి గుర్తు. నిప్పు పాపాన్ని శుద్ధపర్చే క్రీస్తు రక్తానికి గుర్తు(యెషయా 6:6,7;1యోహా 1:7). అలా వేయబడిన (ఆరాధన/ప్రార్ధన)దూపమే దేవునికి అంగీకార యోగ్యమైనది. ఇది యాజకులకు స్పష్టమైన దేవుని ఆజ్ఞ(నిర్గ 30:7-9)! కానీ నాదాబు, అబీహులు దేవుని ఆజ్ఞను మాటలను చులకనగా చూశారు. దేవుడు అనేక మార్లు ఒక వ్యక్తి మారడానికి అవకాశాలు ఇస్తాడు. దేవుని మాటలను చులకనగా తీసుకొనే స్వభావాన్ని విడువక నిర్లక్ష్యన్ని చూపించే వారిపై దేవుని ఉగ్రత అనుకోని సమయంలో, ఊహించని రీతిలో అకస్మాత్తుగా వ్యక్తి మీదకు వస్తాయి(సామె 29:1). దేవుని సముఖంలో(ఆయన నామం పేరిట) చేసే తప్పులకు మరి త్వరగా తీర్పులోకి వస్తాయి(1కొరిధి 11:27-29, అపో 5:5). దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. కనుక దేవునికి దగ్గరగా జీవించే వారిలో ఇలాంటి పరిశుద్ధ భయం కలిగివుండటం అవసరమే!(అపో 5:11, 2సమూ 6:7, యెషయా 6:5)

■ కృప విస్తరంగా ఉంది, క్షమాపణ సిద్ధంగా ఉందని పాపాన్ని చులకనగా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని చూపి, పాపాన్ని సమర్ధించే భావన ఎవరు కలిగించినా, అది అపవాది దగ్గర నుండి కలిగినదే! ఆదిలో ౼'మీరు చావనే చావరు' అని అబద్ధమాడి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను చులకనగా చేసిన అబద్ధం, నేడు క్రైస్తవ లోకంలో పాపాన్ని చులకనగా చూపే 'కృప', అపవాది ఆలోచనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృప'-పాపం నుండి బయటికి రావడానికి అనుగ్రహింపబడిందే గాని పాపంలో ఆనందించడానికి కాదు.అందులో పాపంతో పోరాటం ఉంటుంది. నాదాబు, అబీహులు వారి ప్రత్యేక వస్త్రాలతోనే శిక్షించబడ్డారు. నీకు అనుగ్రహింపబడిన కృప, నీవు ప్రత్యేక పరచబడిన వాడని, నీవు జీవించవల్సిన విధానాన్ని చూపిస్తుంది. అది నీ అర్హత కానప్పుడు,నీకు మరొకని కృప చేత ఇవ్వబడిందని స్పష్టమే కదా! అప్పుడు ఇచ్చిన వానికి లెక్క అప్పజెప్పవాల్సిన బాధ్యత ఉంటుందని మర్చిపోకూడదు.నులివెచ్చని జీవితంతో దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు కానీ, హృదయాల్లో దేవుని ఆత్మ చేత వ్రాయబడిన క్రీస్తు ఆజ్ఞలను(హెబ్రీ 10:16) అనుసరించి నడచుకొనునట్లు, మనల్ని మనం దేవునికి కృపకు అప్పగించుకోవాలి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...