❇ ● ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. ● తమ స్థానం నిలుపుకోని, అధికారాలను వదిలిన దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. ● అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు (యూదా 5-7) ❇ పైన మూడు ఉదాహరణల్లో చెప్పబడిన వారంతా మొదట దేవుని కృపలో నిలచినవారే! దేవునిచే నిలుపబడి కాపాడబడి, కృపను పొంది, తమ స్వేచ్చాపూర్వకంగా దేవున్నుండి వెరైన వారిగా ఉన్నారు. దేవుడు ఎన్నడూ, ఎవ్వరి స్వేచ్చనూ హరించడు (విశ్వాసుల సైతం). ✔ దేవుడు ఇశ్రాయేలీయులతో-"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను"(నిర్గ 6:8) ౼ వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అది స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో నిలిచివుండాలి.కాబట్...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.