Skip to main content

14Aug2017


● ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.
● తమ స్థానం నిలుపుకోని, అధికారాలను వదిలిన దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
● అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు (యూదా 5-7) ❇


పైన మూడు ఉదాహరణల్లో చెప్పబడిన వారంతా మొదట దేవుని కృపలో నిలచినవారే! దేవునిచే నిలుపబడి కాపాడబడి, కృపను పొంది, తమ స్వేచ్చాపూర్వకంగా దేవున్నుండి వెరైన వారిగా ఉన్నారు. దేవుడు ఎన్నడూ, ఎవ్వరి స్వేచ్చనూ హరించడు (విశ్వాసుల సైతం).

✔ దేవుడు ఇశ్రాయేలీయులతో-"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను"(నిర్గ 6:8)
౼ వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అది స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో నిలిచివుండాలి.కాబట్టే పస్కా బలిపశువు ద్వారా రక్షించబడి, ఎఱ్ఱ సముద్రమనే బాప్తిస్మం నుండి దాటి(1కోరింధి 10), అంతం వరకు కొనసాగలేని విశ్వాసాన్ని, రక్షించిన హస్తమే నశింపజేసింది. నశించునట్లు చేసింది వారి అవిశ్వాసమే (క్రీస్తులో నిలిచి ఉండని జీవితం)

✔ పూర్వం పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా దేవుడు వాళ్ళను సంకెళ్లకు అప్పగించి నరకంలో దట్టమైన చీకటిలో తీర్పు వరకు ఉంచాడు.(2పేతు 2:4)
౼దేవదూతలు పరిశుద్ధ దేవుని సముఖంలో నిలిచే గొప్ప అవకాశాన్ని దేవుని వల్ల పొందారు. అక్కడ నిత్యము నిలిచేట్లుగా దేవుని చేత సృష్టించబడ్డారు! ప్రధాన దూత పాపం చేసినప్పుడు, మిగితా దూతలు పాపం చేసినప్పుడు దేవుడే ఆ స్థానాల నుండి వారిని త్రోసేశాడు. అవిశ్వాసాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి వారు కోల్పోయారు.(ఆదాము విషయంలోనూ అదే జరిగింది)

✔ శత్రువుల చెరకు సొదొమ గొమొర్రా ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు అబ్రాహాము ద్వారా కాపాడాడు(ఆది 14)
౼కానీ వారు తమ పాపాన్ని వదిలి దేవుని దగ్గరకు వచ్చిన వారు కాదు. కనుకనే దేవుడే వారిని తిరిగి సంహరించాడు.చివరికి దేవదూత చేత చెయ్యి పట్టుకొని కాపాడబడిన లోతు భార్య సైతం వారిలో ఒక దానిగా యెంచబడింది.

★ యూదా, పేతురు, పౌలు ఆ ఉదాహరణలతో క్రొత్త నిబంధనలోని విశ్వాసులను, సంఘాలను హెచ్చరిస్తున్నాడు.మొదట చేప్పటిన విశ్వాసాన్ని దొంగిలించడానికి దొంగ(సాతాను) ఇప్పటికీ సిద్ధంగావున్నాడు(తప్పుడు సిద్దాంతాలే కాదు, లోకం దాని కోరికలతో సైతం. ఈ రెండింటిలో ఏ ఆయుధానైన వాడు వాడతాడు). ఆయన గొఱ్ఱెలు ఆయన స్వరం వింటాయి..అంటే మాట విని, వెంబడిస్తాయి. ఆయనలో ఉంటాయి. కృప పాపానికి లైసెన్సు కాదు. నేడు దేవుని వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అంతం వరకు క్రీస్తు యేసులో ఉన్నవారే రక్షించబడినవారు. విశ్వాసం అనే దీపాలు కడ దాకా, ఆయన వచ్చేంత వరకు వెలగాలి. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే క్రీస్తు అనే చెట్టులో నిలిచిఉన్నంత వరకు, క్రీస్తు నందు మనం భద్రం చేయబడిన ఉన్నవారము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...