❇ యూదుల మహా సభలో అరిమతయియ యోసేపు అనే మంచివాడు, నీతిపరుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇతడు యూదులకు భయపడి రహస్యంగా యేసును వెంబడించిన శిష్యుడుగా ఉన్నాడు. ఇతను దేవుని రాజ్యం రావాలని ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. యేసును చంపాలని మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు. మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇ ✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుం...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.