❇ యూదుల మహా సభలో అరిమతయియ యోసేపు అనే మంచివాడు, నీతిపరుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇతడు యూదులకు భయపడి రహస్యంగా యేసును వెంబడించిన శిష్యుడుగా ఉన్నాడు. ఇతను దేవుని రాజ్యం రావాలని ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. యేసును చంపాలని మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు.
యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు.
మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇
✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుంపు ఎక్కడా కనిపించలేదు (చివరికి ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన శిష్యులు సైతం). జనసమూహం క్రీస్తు దగ్గరకి వచ్చి ఏదో ఒక మేలు పొందుకొని వెళ్లారు. కాని చనిపోయిన యేసు విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చిన వారు కాదు. అరిమతయియ యోసేపు చనిపోయిన క్రీస్తు దేహం గూర్చి వెళ్తే తన ప్రాణానికి ప్రమాదమని, ఆ దేహం వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని తెల్సినా క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని(సమాధిని) ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేడు అనేకులు ఏదో ఆశించి దేవుని దగ్గరకు వస్తున్న వారే కానీ, క్రీస్తు కొరకు తమను తాము త్యజించుకొని బ్రతుకుచున్నవారు కాదు. ఆ నేరం వారి భోధకులది కూడా!
✔ అప్పటివరకు నీ కోసం ప్రాణం పెడ్తమన్న శిష్యులు పారిపోయారు భయపడుతూ ఉన్న యోసేపు, నికొదేములు ధైర్యంగా బయటికి వచ్చారు. నీతి నిమిత్తం క్రీస్తు పొందుతున్న శ్రమను చూసి, ఒకవేళ తమ ఆత్మలో బలం పొందుకొని ఉండొచ్చు. దేవుని ఆత్మ శక్తితో జీవించక పోతే, భక్తి విషయంలో మొదటివారు చివరివారిగా, చివరి వారు మొదటి వారిగా మారిపోతారు(మన స్వంత శక్తితో దీనిని కొనసాగించలేము అనేది సత్యం).
✔ యెషయా 53:9 లో వ్రాయబడ్డ ప్రవచనాలు తన గూర్చెనని యేసేపుకు తెలిసి ఉండకపోవచ్చు. యేసేపు పుట్టక ముందే ఈ మంచి కార్యం కోసం దేవుడు అతనిని నియమించాడు. సమయం వచ్చినప్పుడు దేవుని మనస్సు ప్రేరేపించగా ఆ మాటకు విధేయుడయ్యాడు. తనను గూర్చిన దేవుని ఉద్దేశ్యలు అప్పుడు అతనిలో నెరవేరాయి. నేడు మనల్ని గూర్చి కూడా మంచి పనులను దేవుడు ముందుగానే నియమించాడు. అవి నేడు మనకి సమీపంలో, మన చుట్టూ ఉన్నాయి. వాటిలో మనం నిలిచి ఉండాలని ఇప్పటికే దేవుడు అక్కడకు మనల్ని నడిపించాడు. అనాది కాలంలో దేవుడు మన కోసం నియమించిన ఏ కార్యం మనలో తప్పిపోకుండా ప్రార్ధిద్దాం! నిలిచి ఉందాం!
యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు.
మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇
✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుంపు ఎక్కడా కనిపించలేదు (చివరికి ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన శిష్యులు సైతం). జనసమూహం క్రీస్తు దగ్గరకి వచ్చి ఏదో ఒక మేలు పొందుకొని వెళ్లారు. కాని చనిపోయిన యేసు విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చిన వారు కాదు. అరిమతయియ యోసేపు చనిపోయిన క్రీస్తు దేహం గూర్చి వెళ్తే తన ప్రాణానికి ప్రమాదమని, ఆ దేహం వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని తెల్సినా క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని(సమాధిని) ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేడు అనేకులు ఏదో ఆశించి దేవుని దగ్గరకు వస్తున్న వారే కానీ, క్రీస్తు కొరకు తమను తాము త్యజించుకొని బ్రతుకుచున్నవారు కాదు. ఆ నేరం వారి భోధకులది కూడా!
✔ అప్పటివరకు నీ కోసం ప్రాణం పెడ్తమన్న శిష్యులు పారిపోయారు భయపడుతూ ఉన్న యోసేపు, నికొదేములు ధైర్యంగా బయటికి వచ్చారు. నీతి నిమిత్తం క్రీస్తు పొందుతున్న శ్రమను చూసి, ఒకవేళ తమ ఆత్మలో బలం పొందుకొని ఉండొచ్చు. దేవుని ఆత్మ శక్తితో జీవించక పోతే, భక్తి విషయంలో మొదటివారు చివరివారిగా, చివరి వారు మొదటి వారిగా మారిపోతారు(మన స్వంత శక్తితో దీనిని కొనసాగించలేము అనేది సత్యం).
✔ యెషయా 53:9 లో వ్రాయబడ్డ ప్రవచనాలు తన గూర్చెనని యేసేపుకు తెలిసి ఉండకపోవచ్చు. యేసేపు పుట్టక ముందే ఈ మంచి కార్యం కోసం దేవుడు అతనిని నియమించాడు. సమయం వచ్చినప్పుడు దేవుని మనస్సు ప్రేరేపించగా ఆ మాటకు విధేయుడయ్యాడు. తనను గూర్చిన దేవుని ఉద్దేశ్యలు అప్పుడు అతనిలో నెరవేరాయి. నేడు మనల్ని గూర్చి కూడా మంచి పనులను దేవుడు ముందుగానే నియమించాడు. అవి నేడు మనకి సమీపంలో, మన చుట్టూ ఉన్నాయి. వాటిలో మనం నిలిచి ఉండాలని ఇప్పటికే దేవుడు అక్కడకు మనల్ని నడిపించాడు. అనాది కాలంలో దేవుడు మన కోసం నియమించిన ఏ కార్యం మనలో తప్పిపోకుండా ప్రార్ధిద్దాం! నిలిచి ఉందాం!
Comments
Post a Comment