Skip to main content

Posts

Showing posts from September 2, 2017

02Sep2017

❇ ఇశ్రాయేలు జాతి ఐగుప్తుకు సుమారు 400 సం|| బానిసలుగా ఉన్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అనేక అద్భుతాలు (విపత్తుల) ద్వారా ఐగుప్తును దేవుడు మొత్తి, తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా పలుకగా,ఫరో తన మనస్సును కఠిన పర్చుకున్నాడు కాని విడువలేదు.చివరి విపత్తుకు ముందు ఫరో మళ్లీ మోషేను పిలిపించి౼"మీరు వెళ్లి దేవుణ్ణి ఆరాధించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి" అన్నాడు. మోషే౼"మా దేవునికి బలి అర్పించడానికి, ఆరాధించడానికి మాకు పశువులు కావాలి. కాబట్టి అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు రావాలి. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి మేము విడిచిపెట్టము" అన్నాడు. ❇ ✔ పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆత్మీయ వర్ణనగా చూపబడతాయి. వారి బానిసత్వం నేడు సాతాను వేసిన (పాపపు బానిసత్వ) సంకేళ్ళకు, శరీర కోర్కెలకు గుర్తుగా ఉన్నాయి. మనలోని ప్రతి ఒక్కరం వివిధ రకాల పాపాలకు బానిసలుగా ఉన్నాము. ఇప్పటికీ వాటిలోని కొన్ని విషయాల ముందు మనం శక్తిహీనులుగా ఉన్నాము. ✔ బయట ప్రజలు నీ గ...