❇ దేవుడు యోహానుకు ఈ లోక అంతంలో జరగబోయ్యే సంగతులను ముందుగానే చూపాడు. వాటిలో ఒక సంఘటన. యోహాను౼"లోక రక్షకుడు అయిదో ముద్రను విప్పినప్పుడు దేవుని సందేశాన్ని బోధించటాన్ని బట్టీ, తమ సాక్ష్యాన్ని బట్టీ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను. వారు పెద్ద స్వరంతో ౼'సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యస్వరూపీ, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?' అని పలికారు. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. 'మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వారి లెక్క మొత్తం పూర్తి అయ్యేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి' అని వారికి చెప్పడం జరిగింది" (ప్రకటన 6:9-11) ❇ ✔ నీతిమంతులు హింసించబడ్డారు, చంపబడ్డారు..ఇప్పటికీ భాధింపబడుతూ, చంపబడుతూ ఉన్నారు. దేవుని భయంలేని దుష్టులకు, వారి పనులకు అడ్డుఅదుపు లేకుండా ఉన్నప్పటికీ, అన్యాయమే గెలుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికి, వారి చేతిలోనే సమస్తం ఉన్నదనట్లు మనకు అనిపిస్తున్నప్పుడు.. మన మనస్సుల్లో మెదిలే ప్రశ్నలకు సమాధానం ఇదే!...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.