Skip to main content

Posts

Showing posts from August 10, 2017

10Aug2017

❇ యేసు..పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన బట్టలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా. వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు మనుషులనూ చూశారు. ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే.. పేతురు౼"ప్రభూ! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను కడతాము– ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం ౼“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.” ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు ఒక్కడే వారికి కనబడ్డాడు. ఆ రోజుల్లో వారు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు. ❇ ✔ మోషే, ఏలియాలు క్రీస్తుకు పూర్వం వందల యేళ్ళ క్రితం జీవిం...