Skip to main content

10Aug2017

యేసు..పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన బట్టలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా. వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు మనుషులనూ చూశారు.

ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే..
పేతురు౼"ప్రభూ! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను కడతాము– ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం ౼“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.”
ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు ఒక్కడే వారికి కనబడ్డాడు. ఆ రోజుల్లో వారు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.

✔ మోషే, ఏలియాలు క్రీస్తుకు పూర్వం వందల యేళ్ళ క్రితం జీవించిన భక్తులు. క్రీస్తు మరణం గూర్చి మాట్లాడటానికి దేవుడు వీరిని తిరిగి భూమిపైకి పంపాడు. దేవుని కృప యెంత గొప్పదంటే౼ఒకప్పుడు మరణం గూర్చి భయపడిన ఏలియాను 'గొప్పదైన క్రీస్తు మరణం' గూర్చి మాట్లాడే రాయబారిగా పంపాడు. ఒకప్పుడు నరహత్య చేసిన మోషేను, లోకం చేయ్యబోవు 'గొప్ప హత్య' గూర్చి ప్రకటించే వానిగా పంపాడు. ఇలాంటి మానవాళికి అంతు చిక్కని కార్యాలు దేవునితోనే సాధ్యం. మనం దేవుని శక్తితో నింపబడినప్పుడు, మన జీవితంలో క్రీస్తును కలుసుకోక ముందు(లేదా నేడు) ఏ విషయంలో బలహీనులుగా కనిపిస్తున్నామో౼అదే విషయంలో బలవంతునిగా నిలిపి దేవుడు మనల్ని వాడుకొన సమర్ధుడు.

✔ క్రీస్తు యేసులో ఉన్న దీనత్వం, తగ్గింపును గమనించారా! సమీపింపరాని తేజస్సులో నివాసముండే సృష్టికర్త, బలహీనులు సృష్టించబడిన వ్యక్తులలో కలసి, వారిలో ఒకనిగా మాట్లాడుతున్నాడు. దేవ దూతలచే బలపరచబడు బలహీన శరీరాన్ని దాల్చాడు. క్రీస్తు అంతగా తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కుమారుడు కాబట్టి అంగీకరించబడలేదు కాని, అందరి కంటే దీనుడుగా దేవుని ముందు ఉన్నాడు కాబట్టే అందరికి పైగా హెచ్చించబడ్డాడు. శిష్యులకు ఆ తర్వాత ధర్మశాస్త్రం(మోషే), ప్రవక్తల(ఏలీయా) కంటే శ్రేష్ఠుడైన యేసు ఒక్కడే కనిపించాడు. నేడు మనం యేసు మాట వినాలని(అనుసరించాలని) దేవుడు ఆదేశిస్తున్నాడు (హెబ్రీ1:1,2).ఆయనే మనకు సంపూర్ణ మాదిరి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...