❇ మోషే సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ దేవునితో ఉన్నాడు. ఆ సమయంలో కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. అప్పుడు ప్రజలు౼"ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే" అన్నారు. అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు౼"రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది" అంటూ ప్రకటన చేశాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు. శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారు. దేవుని కోపం వారిపై రగులుకొన్నది. ❇ ✔ ప్రజలు యెహోవా పేరునే మ్రొక్కారు౼బలులు అర్పించారు. తర్వాత తమకు నచ్చినట్లు ఆడారు. వీరికి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యమంటున్నాడో పనిలేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నట్లేతే వాటిని సైతం వారి కోరికలకు తగినట్లు అన్వయించుకునే వారు. నేడు ఈ వైఖరి సంఘాల్లో, సహవాసాల్లో కనిపించట్లేదా? ప్రజలను భావోద్రేకాలతో (emotions) చేసే భక్తిని ప్రోత్సహించే అహరోను లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. వారి మనసుకు ఉల్ల...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.