❇ యేసు ఒక కథ చెప్పాడు.. "ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో౼ 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు. అతడు౼'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు. కాని తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు. తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు౼‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గాని వెళ్ళలేదు" 'ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?' అని వారిని అడిగాడు. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు౼"మొదటివాడే" అని జవాబిచ్చారు. యేసు౼"నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవక్తయైన యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు . ❇ ✔ గమనిస్తే మొదటి వాని మాటల్లో తండ్రి పట్ల గౌరవం లేదు. తిరుగుబాటు స్వరం, తన ఇష్టానుసారంగా ప్రవర్తన కనిపిస్తుంది. కాని ద్వేషించినా, తిరుగుబాటు చేసినా దాపరికం లేదు. వానిలో లోపట బయట ఒకే వ్యక్తి కనిపిస్తాడ...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.