Skip to main content

05Sep2015


యేసు ఒక కథ చెప్పాడు..
"ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో౼ 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు.
అతడు౼'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు. కాని తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు.
తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు.
అతడు౼‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గాని వెళ్ళలేదు"
'ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?' అని వారిని అడిగాడు.
ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు౼"మొదటివాడే" అని జవాబిచ్చారు.
యేసు౼"నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
ప్రవక్తయైన యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు. ❇

✔ గమనిస్తే మొదటి వాని మాటల్లో తండ్రి పట్ల గౌరవం లేదు. తిరుగుబాటు స్వరం, తన ఇష్టానుసారంగా ప్రవర్తన కనిపిస్తుంది. కాని ద్వేషించినా, తిరుగుబాటు చేసినా దాపరికం లేదు. వానిలో లోపట బయట ఒకే వ్యక్తి కనిపిస్తాడు. (యదార్థవంతుడు). అటువంటి వారి మనస్సుతో దేవుని స్వరం మాట్లాడితే.. పశ్చాత్తాపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి నిరీక్షణ వుంది. (వారు ఆయాన్ని బహిరంగంగా తిరస్కరించినప్పటికి కూడా) నిజంగా దేవుడు ఇలాంటి వారిని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన ఆత్మను వారి హృదయలకు దగ్గరగా ఉంచి, సరైన సమయంలో ఒప్పుదల లోకి తీసుకొస్తాడు.

✔ కానీ రెండవ వాడిలో మోసపూరితమైన జీవితం ఉంది. స్వరం విధేయుడైనట్లు మృదువుగా మాట్లాడుతుంది కానీ అంతరంగంలో అవిధేయత ఉంది. ఇది వేషధారణ! కపట జీవితం. మొదటి వాడి వలె కఠినమైన మాటలు నేను మాట్లాడానని తన మనస్సు అంతరంగంగా ప్రగల్బాలు పలుకుతుంది. అతిశయిస్తుంది! ఒకవేళ మనం ఈ సంభాషణలో ఉంటే, ఖచ్చితంగా మొదటి వాడు చెడ్డవాడని, రెండోవాడు మంచి జీవితంలో ఉన్నాడని భావిస్తాము. మోసగించబడతాము. కాని ఎవ్వరూ దేవుణ్ని మోసగించలేరు.

✔ యేసు పాపం చేసిన వారి కంటే కూడా, మేము నీతిమంతులం అనుకునే వేషధారులనే ఎక్కువ గద్దించాడు. అలాంటి వారు నిజంగా ఉన్న నీతిమార్గాన్ని ఎన్నడూ గుర్తుపట్టలేరు. వారు రక్షకుని గూర్చి రోజు ధ్యానిస్తూ, భోదిస్తూ..ఆయన వారి కళ్లముందుకు వచ్చినప్పుడు ఆయన్నే ద్వేషించి, చంపారు. నేడు దైవ సంభంధులను గుర్తుపట్టలేని వారు, పరిసయ్యుల సంతానంగా దేవునిచే పిలువబడతారని ఖచ్చితంగా చెప్పవచ్చు(నీవు దేవునితో నడిచే వ్యక్తివైతే ఆయనతో నడుస్తున్న వారినీ గుర్తుపడతావు). వారి హృదయాలు దేవుని ఎదుట చెడిపోయి ఉండటం వల్ల దేవుని మాటకు ఎదురాడుతారు. మంచి పని(మాట) వెనుక, చెడిపోయిన ఉద్దేశ్యాలు కలిగి ఉండొచ్చు.

౼ దేవుణ్ని వెంబడించడం అంటే ఆయన వలె ప్రవర్తించడం. దేవుడు... మాటను, పనిని చూడడు. ఉద్దేశాన్ని, అంతరంగాన్ని లక్ష్యపెడతాడు. కనుక దానిని జరిగించే ఆత్మను వివేచించాలి. యెదుట ఉన్న వారి హృదయాన్ని దైవ కోణంలో చూసినప్పుడు, ఆ వ్యక్తికి ఏమి అవసరమో (కనికరం, ఓదార్పు, గద్దింపు మె|| ) దైవ ప్రేమలో నుండి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...