❇ జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడేవారు. మనుషులు తూర్పు దిక్కునుండి బయలుదేరి, షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొని అక్కడే స్థిరపడి పోయారు. అప్పటి నుంచే ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాకుండా ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారును ఉపయోగించారు. అప్పుడు మనుషులు౼“మనం భూమి అంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని అనుకున్నారు. ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. అది ఆయన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఉంది, కనుక వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్లు ఒకరు మాట్లాడేది ఒకరు అర్థం చేసుకోలేకపోయ్యారు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ప్రజలు ఆపివేసి, భూమిమీద ఇతర చోట్లన్నింటికీ చెదరిపోయ్యారు.ఆవిధంగా మనుషులు భూమి అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసినందు చేత ఆ నగరానికి "బాబెలు" అనే పేరు వచ్చింది. ❇ జలప్రళయం తర్వాత దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో౼"ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.