Skip to main content

08Sep2017


జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడేవారు. మనుషులు తూర్పు దిక్కునుండి బయలుదేరి, షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొని అక్కడే స్థిరపడి పోయారు. అప్పటి నుంచే ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాకుండా ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారును ఉపయోగించారు.
అప్పుడు మనుషులు౼“మనం భూమి అంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని అనుకున్నారు.
ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. అది ఆయన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఉంది, కనుక వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్లు ఒకరు మాట్లాడేది ఒకరు అర్థం చేసుకోలేకపోయ్యారు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ప్రజలు ఆపివేసి, భూమిమీద ఇతర చోట్లన్నింటికీ చెదరిపోయ్యారు.ఆవిధంగా మనుషులు భూమి అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసినందు చేత ఆ నగరానికి "బాబెలు" అనే పేరు వచ్చింది.

జలప్రళయం తర్వాత దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో౼"ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి" అన్నాడు(ఆది 9:1,1:28). కానీ వారు చెదరిపోకుండా ఒకే చోట ఉండటం దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధం. వారు గోపురం కట్టి తమకు పేరు తెచ్చుకోవాలనుకున్నారు. మనిషి దేవుని ఉద్దేశ్యాల నుండి వైదొలగినప్పుడు, తన స్వంత ఆలోచనలు, ప్రణాళికల్లోనే బ్రతుకుతాడు. దాని వెనుక ఉద్దేశ్యం తన పేరు కోసం, గొప్ప కోసం, భూసంభందమైన సుఖాలకోసమే మాత్రమే ఆలోచిస్తాడు, జీవిస్తాడు.ఇక్కడ వారిలో ఐక్యత కనిపిస్తుంది, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం (technology) ఉంది. కానీ వారి జీవితాల్లో దేవునితో సంభంధం లేదు. ఒకని భూసంభందమైన జ్ఞానం, అతని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచించదు. వారి సొంత జ్ఞానమే వారిని దారి తప్పేట్లు చేస్తుంది. ఎవ్వరైతే లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి, దైవ జ్ఞానం మీద ఆధారపడతారో వారే ఆయన చిత్తంలో నిలుస్తారు(క్రీస్తు పుట్టుక సమయంలో జ్ఞానులు, గొఱ్ఱెల కాపరులు దీనికి ఒక ఉదాహరణ) ఒకడు లోకాన్ని సంపాదించుకొని దేవుని కోల్పోతే ఏం ప్రయోజనం? వారి ప్రయాస వ్యర్ధ ప్రయత్నం. నేడు అనేక మంది విశ్వాసులు వారి జీవితాల్లో బాబెలు నిర్మించుకుంటున్నారు. అప్పుడు వారికి మిగిలిందే చివరికి వీరికి మిగులుతుంది. వ్యర్ధంగా పరుగెత్తి, వట్టి చేతులతో దేవుని ముందు ఒక రోజు నిలబడతారు.

క్రీస్తు తన జీవితంలో దేవుని ప్రణాళికలల్లో సంతోషిస్తూ, ఆయనకు లోబడి జీవించడలోనే ఆనందించాడు. అదే ఆయన జీవిత లక్ష్యంగా బ్రతికాడు. క్రీస్తును వెంబడించే వారు తమ జీవితాలకు తామే ప్రణాళికలు రచించుకోవడం ఆపివేసి, దేవుని వాక్యానుసారం జీవిస్తారు(దేవుని చిత్తం కోసం కనిపెడతారు). అందులో నిలిచి ఉండటంలోనే ఆనందిస్తారు. దేవుని మాట నుండి వైదొలగి, తమ సొంత ఆలోచనలను నమ్మి, తీసుకున్న తప్పుడు నిర్ణయంతో ఏదేనులో మొదటి పాపం ఆరంభమైయ్యింది.మన స్వంత(పాపపు)స్వభావం విషయంలో చనిపోయి, దేవుని మాట వినే విషయంలో బ్రతకాలని క్రీస్తు సిలువలో చనిపోయ్యాడు. మార్గం తప్పిన మన జీవితాలను తిరిగి సరైన స్థానం ఉంచడానికే రక్షకుడు తిరిగి లేచాడు. ఏదేనులో పాపం చేసినప్పుడు ఆత్మలో చచ్చిన అవిధేయుడైన మనిషిని-ఆ స్వభావాన్ని, ఆయనతో పాటు సిలువలో చంపివేసి, ఆయనతో పాటు తిరిగి లేపి, మళ్ళీ నూతనంగా ఆత్మలో జన్మింపజేశాడు. ఈ స్వభావం సొంత ప్రణాళికల విషయమై చనిపోయిన స్వభావం. కనుక ఇకను మన కోసం కాక, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుని నిమిత్తం బ్రతకావాల్సినవారము.ఇప్పటికీ ఆ తీర్మానం గూర్చిన స్వేచ్ఛ (విశ్వాసులమైన) మనకుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...