Skip to main content

Posts

Showing posts from September 30, 2017

30Sep2017

❇ యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి రాగా దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు. అక్కడ 40 రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు గనుక ఆయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు.... ● సాతాను ఆయనతో౼"నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు. యేసు౼"మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది"   ✔ 40 రోజుల క్రిందట దేవుడు-యేసును గూర్చి'ఈయనే నా ప్రియమైన కుమారుడు' అని సాక్ష్యం పలికాడు. ఆ మాటతోనే మొదలు పెడుతూ సాతాను ఆయన్ను శోధించడం మనం గమనించవచ్చు. అపవాది యేసులోని దైవత్వం నిరూపించు కొమ్మని అడిగితే, సాత్వికుడైన యేసు తను తాను మానవుని (మనుష్యుడు)గా బదులు పలుకుతున్నాడు. ఏదేనులో దేవతల వలె ఉంటారన్న సాతాను అబద్ధపు ప్రలోభాలకు మొదటి మనుష్యులు పూర్తిగా లోబడ్డారు. వారు ఆత్మకంటే శరీరాన్ని, భూసంభందమైన సౌఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ యేసు తన శరీర ఆకలిదప్పుల కృశించి పోతున్నప్పటికి దేవునితో సంభంధం కలిగి ఉండటాన్నే విలువైనదిగా ఎంచాడు. ● ఆ తర్వాత ...