యేసు-"ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ"(లూకా 22:53). క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు.. ◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు. ◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!" ◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు. ◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు. ✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూప...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.