యేసు-"ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ"(లూకా 22:53).
క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు..
◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు.
◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!"
◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.
◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూపేటట్లుగా చేసి, అత్రికమించేట్లు చేయడమే! శిలువలో యేసుపై అంధకార శక్తుల ప్రభావం బహు బలంగా పనిచేసాయి.ఆయనను శోధించిన వారిని మాటలు గమనిస్తే, చీకటి శక్తులు వారిని ఆక్రమించి ౼'సిలువ దిగి, ఆయనను ఆయన రుజువు చేసుకోమన్న' సవాలేనని మనం గమనించొచ్చు. ఒకవేళ ఆయన ఆవిధంగా రుజువు చేసుకుంటే నేడు మానవాళికి రక్షణ, నిరీక్షణ లేదు. ఎందుకంటే లోక పాపానికి దేవుడు సిలువలో శిక్ష విధించాడు.
✔ నూతన నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది, ఆత్మ సంభంధమైనది. దేవుని ఆమోదం, దేవుడు మన పక్షాన (భౌతికంగా) కలుగజేసుకుంటేనే కాదు..మన శరీరాలు నలగొట్టబడుతూ కూడా సంతోషంతో దేవుణ్ని మహిమపరచడాన్ని నేర్పిస్తుంది. హెబ్రీ 11:35 ముందు వచనాలు, తర్వాత వచనాలకు గల తేడా గమనించండి.రెండు నిబంధనల్లో దేవుడు చూపిన వ్యత్యాసం మనం చూడొచ్చు. నూతన నిబంధన శ్రేష్టమైనది! మన శరీరం ద్వారా ఆత్మలో నుండి దేవుణ్ని మహిమపరచడం!
✔ ఆత్మీయ అంధకారంలో ఉన్న ఆ ప్రజలు క్రీస్తు బలసంపన్నాన్ని గ్రహించలేకపోయ్యారు. క్రీస్తు అంధకార శక్తుల కుయుక్తులను గ్రహిస్తున్నాడు.ఆయనకు బాగా తెలుసు.. ఆయన పోరాడాల్సింది శరీరులతో కాదు గాని అంధకార శక్తులతోనని.ఆయన శరీరులను అప్పుడే క్షమించాడు కదా!.. క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది..మనది ఆత్మీయ పోరాటం! శరీరులతో యుద్ధం ఆడకూడదు.(కొలస్సి 2:15, 1యోహా4:4)
క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు..
◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు.
◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!"
◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.
◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూపేటట్లుగా చేసి, అత్రికమించేట్లు చేయడమే! శిలువలో యేసుపై అంధకార శక్తుల ప్రభావం బహు బలంగా పనిచేసాయి.ఆయనను శోధించిన వారిని మాటలు గమనిస్తే, చీకటి శక్తులు వారిని ఆక్రమించి ౼'సిలువ దిగి, ఆయనను ఆయన రుజువు చేసుకోమన్న' సవాలేనని మనం గమనించొచ్చు. ఒకవేళ ఆయన ఆవిధంగా రుజువు చేసుకుంటే నేడు మానవాళికి రక్షణ, నిరీక్షణ లేదు. ఎందుకంటే లోక పాపానికి దేవుడు సిలువలో శిక్ష విధించాడు.
✔ నూతన నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది, ఆత్మ సంభంధమైనది. దేవుని ఆమోదం, దేవుడు మన పక్షాన (భౌతికంగా) కలుగజేసుకుంటేనే కాదు..మన శరీరాలు నలగొట్టబడుతూ కూడా సంతోషంతో దేవుణ్ని మహిమపరచడాన్ని నేర్పిస్తుంది. హెబ్రీ 11:35 ముందు వచనాలు, తర్వాత వచనాలకు గల తేడా గమనించండి.రెండు నిబంధనల్లో దేవుడు చూపిన వ్యత్యాసం మనం చూడొచ్చు. నూతన నిబంధన శ్రేష్టమైనది! మన శరీరం ద్వారా ఆత్మలో నుండి దేవుణ్ని మహిమపరచడం!
✔ ఆత్మీయ అంధకారంలో ఉన్న ఆ ప్రజలు క్రీస్తు బలసంపన్నాన్ని గ్రహించలేకపోయ్యారు. క్రీస్తు అంధకార శక్తుల కుయుక్తులను గ్రహిస్తున్నాడు.ఆయనకు బాగా తెలుసు.. ఆయన పోరాడాల్సింది శరీరులతో కాదు గాని అంధకార శక్తులతోనని.ఆయన శరీరులను అప్పుడే క్షమించాడు కదా!.. క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది..మనది ఆత్మీయ పోరాటం! శరీరులతో యుద్ధం ఆడకూడదు.(కొలస్సి 2:15, 1యోహా4:4)
Comments
Post a Comment