❇ యెరూషలేములో "సుమెయోను" అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు, 'ఇశ్రాయేలుకు ఆదరణ కలిగేదెప్పుడా' అని రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు రక్షకుణ్ని చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి మరియ-యోసేపులు చంటి బిడ్డయైన యేసును దేవాలయంలోకి తెచ్చారు. ఆ రోజు సుమెయోను ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. అతడు తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ౼ “ప్రభూ, ఇ ప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కళ్ళారా చూశాను.అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ” అన్నాడు. యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.(లూకా 2:25-33) ❇ ■ సుమెయోను రక్షకుని రాక కోసం ఆసక్తితో కనిపెట్టాడు కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా రక్షకున్ని చూశాకే చనిపోతావని దేవుడు అతనికి వాగ్ధానం చేశాడు.ఎవరు ఆసక్తిపరులై దేవుణ్ని వెతకుతారో వారే దేవుని...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.