❇ అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగించారు. గనుక మోషే యెహోషువతో ౼"మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను" అన్నాడు. మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు క్రిందకు దించకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకూ కదలకుండా ఉన్నాయి. ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల రాజునూ, అతని సైన్యాన్ని ఓడించాడు. ❇ ■ రెఫిదీంకు దేవుడే ఇశ్రాయేలీయులను నడిపించాడు(నిర్గ 17:1). మొదట అక్కడ నీళ్లు దొరకనదుకు వాళ్ళు మోషేపై దేవునిపై సణిగారు. దేవుడు బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. తర్వాత అక్కడే అమాలేకీయులు వారితో యుద్దానికి దిగారు...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.