Skip to main content

17Oct2017


❇ అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగించారు. గనుక మోషే యెహోషువతో ౼"మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను" అన్నాడు.

మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు క్రిందకు దించకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకూ కదలకుండా ఉన్నాయి.

ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల రాజునూ, అతని సైన్యాన్ని ఓడించాడు. ❇


■ రెఫిదీంకు దేవుడే ఇశ్రాయేలీయులను నడిపించాడు(నిర్గ 17:1). మొదట అక్కడ నీళ్లు దొరకనదుకు వాళ్ళు మోషేపై దేవునిపై సణిగారు. దేవుడు బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. తర్వాత అక్కడే అమాలేకీయులు వారితో యుద్దానికి దిగారు. ఈ రెండు సంఘటనల్లో సమస్యలు వచ్చినప్పుడు ౼"వాటి పరిష్కరాలను" మోషే(ద్వారానే) దగ్గరే దేవుడు ఉంచటం చూస్తాము. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. దించినప్పుడు ఓడిపోయ్యారు. మోషే చెయ్యి ఎత్తడానికి-ఇశ్రాయేలీయుల బలానికి దేవుడు ఏదో సంబంధాన్ని ఉంచాడని అర్ధమౌతుంది. నిర్గమ 17:16 ను బట్టి చూస్తే "అమాలేకీయులు తమ చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు" అని ఉంది. మోషే చెయ్యి ఎత్తి మొరపెట్టింది యెహోవా సింహాసనం వైపని , ఆయన బలం కొరకేనని సహజంగానే తెలుసుకోవచ్చు. అప్పటి వరకు (ఐగుప్తీయులతో) దేవుడే వారి యుద్ధాలను వారి పక్షాన చేశాడు(నిర్గ 14:14). కానీ నేడు వారు కూడా పోరాడాలని దేవుడు సూచిస్తున్నాడు. ఐతే ఇశ్రాయేలీయులు వారి స్వంత బలంతో ఖచ్చితంగా అమాలేకీయులను గెలవలేరు గాని దేవుని బలంతోనే మాత్రమే గెలవగలరనేది స్పష్టమైన విషయం.

■ పాత నిబంధనలోని ఈ విషయాలు క్రొత్త నిబంధనలోని మనకు నిజమైన, శ్రేష్ఠమైన, పరిపూర్ణమైన విషయాలకు గుర్తుగా మాత్రమే ఇవ్వబడ్డాయని గుర్తించాలి. పాత నిబంధన ఒక నీడ మాత్రమే. రక్షణలో మన భాగం౼దేవుడు మన పక్షాన (సిలువలో) ఏం చేశాడో దాని మీద విశ్వాసం మాత్రమే. దానిలో మానవుని స్వక్రియలు ఉండవు. ఇది ఐగుప్తు నుండి వారు పొందిన విడుదలను సూచిస్తుంది. ఊరకనే నిలువబడి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను విశ్వాసంతో పొందుకోనే బహుమానం! కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి క్రీస్తులో ఆధ్యాత్మిక యోధునిగా మారాలి. మన స్వశక్తితో కాదు గానీ క్రీస్తు యేసులో ఉన్న కృపను బట్టి బలవంతులుగా మారాలి. నేడు మనం పొరాడేది దురాత్మ శక్తులతో, శరీర సంభంధమైన దురాశలతో.

■ ఇశ్రాయేలీయులు అప్పటి వరకు గెలుస్తున్నట్లే అనిపిస్తూ, మళ్ళీ ఓడిపోతూ ఉన్నప్పుడు మోషే గమనించి౼ చేతులెత్తి తాను చేసే ప్రార్ధనలోనే ఆ శక్తి ఉందని గ్రహించి, శిఖరంపై ప్రార్ధనలో పోరాడాడు. ఇప్పుడు కూడా విశ్వాసి మానవ బలంతో ఏమీ సాధించలేడని(ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు) అని గ్రహించి, విశ్వాసంతో చేతులెత్తి (నిస్సహయతను, అర్ధించడాన్ని సూచిస్తుంది) ప్రార్ధించినప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుంది. మన కోసం అలుపెరుగని, నిరంతరం ప్రార్ధించే విజ్ఞానకర్త ఒకరు పరలోకంలో ఉన్నారు. ఆయనే మన రక్ష కర్తయైన దేవుడు. ఆయనలోనే సమస్త (పరిష్కర మార్గాలను) విడుదలను, విమోచనను దేవుడు ఉంచాడు. కనుక ఆయన నుండే శక్తి పరలోక సింహాసనం నుండి వస్తుంది. గనుక అలుపెరుగక క్రీస్తు కృపను ఆశ్రయిద్దాం!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...