ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది..మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. దేవదూతలు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" మరియ-"ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు. యేసు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?". ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని- "అయ్యా! ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే, ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అప్పుడు యేసు- "మరియా" అని పిలిచాడు. ❇ ✔ పునరుద్దాన దినం రోజు ఆయన తల్లియైన మరియ గూర్చిన ప్రస్తావన లేదు, కాని 4 సువార్తల్లో మగ్దలేనే మరియ(7దయ్యాలు పట్టి, యేసుచేత బాగుచేయ్యబడ్డ స్త్రీ) గూర్చి వ్రా...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.