Skip to main content

Posts

Showing posts from December 13, 2017

13Dec2017

❇  మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. మిద్యానులో రగూయేలు అనే యాజకునికి 7 కుమార్తెలున్నారు. ఒకరోజు వారు తమ తండ్రి గొర్రెల మందకు నీళ్లు తీసుకొని రావడాని ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేశారు కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు నీళ్లు చేదుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టేశారు. కనుక మోషే వారికి సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. అతడు వారితో ౼"ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అన్నాడు. వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు. అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు. అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు.  ❇ ■ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనుకున్న మోషేకు చేదు అనుభవం ఎదురయ్యింది.అప్పటికే మేలుకు ప్రతిగా జరిగిన కీడు...