
అతడు వారితో ౼"ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అన్నాడు.
వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు.
అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు.
అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు.
❇
వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు.
అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు.
అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు.

■ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనుకున్న మోషేకు చేదు అనుభవం ఎదురయ్యింది.అప్పటికే మేలుకు ప్రతిగా జరిగిన కీడును బట్టి నిరాశ, నిస్పృహలతో ఐగుప్తును విడిచిన మోషే, యెదుట దేవుడు మరొక సంఘటనను ఉంచాడు. బలహీనులైన స్త్రీలను, బలవంతులైన గొర్రెల కాపరులు అడ్డగించినప్పుడు..తనకు సంబంధంలేని వ్యక్తుల కోసం మెషే నిలబడ్డాడు. ఒక్కడుగా ఉన్న మోషే, తనది కానీ ప్రాంతంలో, గొఱ్ఱల కాపరులకు ఎదురుగా నిలవడం నిజంగా ప్రాణాపాయమే! ఐనా తన గురించి కాకుండా ఎదుటివారి మేలుకోసం మాత్రమే ఆలోచించాడు(ఫిలిప్పీ 2:4). మోషేలోని నాయకత్వ లక్షణాలను పై సందర్భంలో స్పష్టంగా చూడవచ్చు.నాయకుడు ఒంటరిగా మిగిలిపోయినా, ఎవరూ తనను వెంబడింపక పోయినా నాయకుడు.. నాయకునిలాగే ప్రవర్తిస్తాడు. నాయకత్వం అంతరంగంగా ఇమిడి వుండే లక్షణం! దేవుడు నియమించే నాయకులలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలను పొందు పరుస్తాడు. మోషే నాయకత్వంలో లోపాలు ఉన్నాయి! అది ముడి వజ్రంలాంటిది, దేవుడు దాన్ని సాన పెట్టబోవుతున్నాడు.
● ఆ సమయంలో ఒకవేళ ఇశ్రాయేలీయులకు మెషే మీది అభిప్రాయం ఇదై ఉండొచ్చు౼'దేవుడు విడిపించే నాయకుడు తానే అనుకుని ఫరోతో తలపడాలని చూసి పారిపోయిన వ్యక్తి'
● ఐగుప్తీయులు/ఫరో ఇంటివారి దృష్టిలో౼'బానిసల్లో ఒక్కడని తెల్సినా జాలిచూపి అంతఃపురంలో రాజకుమారునిగా పెరగనిస్తే..బానిసబుద్ధి చూపించిన ఒక కృతజ్ఞతరహితుడు'
● ఐగుప్తీయులు/ఫరో ఇంటివారి దృష్టిలో౼'బానిసల్లో ఒక్కడని తెల్సినా జాలిచూపి అంతఃపురంలో రాజకుమారునిగా పెరగనిస్తే..బానిసబుద్ధి చూపించిన ఒక కృతజ్ఞతరహితుడు'
■ కానీ దేవుని మనస్సులో మోషేపై అభిప్రాయం వీటికి భిన్నంగా ఉంది(హెబ్రీ 11:24-27). మనుష్యులు పనులు మాత్రమే చూడగలరు గాని దేవుడు అంతరంగాన్ని చూసే వానిగా ఉన్నాడు(1దిన 28:9).మనుష్యుల ఎదుటి వారి గూర్చి వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు(చాలా సార్లు అవి తప్పుడు అభిప్రాయాలగానే ఉంటాయి).కానీ దేవుడు ఆ వ్యక్తి మేలు గోరి సహాయకునిలా నిలుస్తాడు.ఆయన మన పనుల కంటే కూడా దాని వెనుక ఉద్దేశ్యాలను లక్ష్యపెడతాడు. ఆ తప్పిదాలను గూర్చి ఆ వ్యక్తికి వెలిగింపు ఉందా(struggler or rebellion)అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. మోషే అప్పుడు విధానం పరంగా తప్పిపోయాడు గాని ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యం సరైనదిగా ఉన్నట్లు దేవుడు చూచాడు.
■ తన మామయైన రగూయేలు ఇంట్లో 40సం౹౹ అతి సామాన్య జీవితం జీవించాడు.ఒకప్పుడు ఆయుధాలు పట్టుకున్న చేతితో, కాపరి దుడ్డు కర్రను పట్టుకున్నాడు. సకలవిద్యలు నేర్చి జ్ఞానంతో మాట్లాడిన నోటితో, గొర్రెలును తోలాడు. యవ్వన వయస్సు దాటిపోయింది. వేటిని బట్టి తాను ఇశ్రాయేలీయులను విడిపించగలనని అనుకున్నాడో అవన్నీ తొలగించబడ్డాయి. తానెప్పుడైతే ఇక అర్హుడను కాను అనుకున్నాడో..అప్పుడే దేవుని చేత పిలువబడి,నిజమైన నాయకునిగా రూపుదిద్దబడ్డాడు.స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలను చేయగల దేవుని బలానికి తనను తాను లోపర్చుకున్నాడు.ఐగుప్తు సామ్రాజ్యాన్ని దైవ శక్తితో వణికించాడు.అసాధ్యమైన కార్యాలు దేవుని బలంతో సాధకమవ్వటం కన్నులారా చూచాడు.అలా చరిత్రలో గొప్ప నాయకుడయ్యాడు.
★ 'దేవుడు లేకుండా మన శక్తి శూన్యం౼దేవుని ద్వారానే సమస్తం సాధ్యం' అని ఏ వ్యక్తి(నాయకుడు) ఈ సత్యాన్ని అని గుర్తెరిగి అనుభవపూర్వకంగా లోపర్చు కుంటాడో అప్పుడే దేవుని ఉద్దేశ్యాలు మన జీవితంలో పరిపూర్ణమౌతాయి.
Comments
Post a Comment