Skip to main content

Posts

Showing posts from October 4, 2017

04Oct2017

❇ మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. కానీ నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ,నిందారహితుడూ దేవుని సహవాసంలో నడిచినవాడు. ఒకరోజు దేవుడు నోవహుతో౼"మనుషుల దౌర్జన్యన్ని బట్టి నా సముఖం నుంచి వారిని, ప్రతి శరీరి నిర్మూలమైపోబోతుంది. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో...నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. అయితే నేను నీతో నా నిబంధన చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి వెళ్ళాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి జాతిలో మగది, ఆడది బ్రతికునట్లు అవి నీ దగ్గరికి వస్తాయి" ❇ ✔ దేవునికి విసుగు పుట్టించిన మనుష్యులతో నీతిమంతుడైన నోవహు ఎలాంటి భాధలు పడుతూ బ్రతికి ఉంటాడో ఉహించండి. ఒకవేళ వారిలో ఒకడైతే సమస్యే ఉండదు కానీ లోకానికి వేరుగా జీవించి దేవునితో నడిచే వ్యక్తియైతే(odd man...