❇ మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. కానీ నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ,నిందారహితుడూ దేవుని సహవాసంలో నడిచినవాడు.
ఒకరోజు దేవుడు నోవహుతో౼"మనుషుల దౌర్జన్యన్ని బట్టి నా సముఖం నుంచి వారిని, ప్రతి శరీరి నిర్మూలమైపోబోతుంది. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో...నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను.
అయితే నేను నీతో నా నిబంధన చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి వెళ్ళాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి జాతిలో మగది, ఆడది బ్రతికునట్లు అవి నీ దగ్గరికి వస్తాయి" ❇
✔ దేవునికి విసుగు పుట్టించిన మనుష్యులతో నీతిమంతుడైన నోవహు ఎలాంటి భాధలు పడుతూ బ్రతికి ఉంటాడో ఉహించండి. ఒకవేళ వారిలో ఒకడైతే సమస్యే ఉండదు కానీ లోకానికి వేరుగా జీవించి దేవునితో నడిచే వ్యక్తియైతే(odd man out) ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. అతను ఎగతాళి చేయబడతాడు, ఒంటరైపోతాడు, నిందలు పడతాడు. అతన్ని కానీ, అతని మాటల్ని కానీ ఎవ్వరూ లక్యపెట్టలేదు.కానీ నోవాహు లోకపోకడను చులకనగా చూసి, దేవునిలోని సంతోషాన్నే అమితంగా లక్యపెట్టాడు.ఈ విధంగా నోవహు లోకంపై నేరం మోపాడు లేఖనాలు చెప్తున్నాయి (హెబ్రీ 11:7).
✔ కనుకనే దేవుని దృష్టిలో కూడా ప్రత్యేకి అయ్యాడు. ఆ ఒక్కనితోనే దేవుడు మాట్లాడాడు. నోవహు దేవుని స్వరం అనుదినం వినే అనుభవం లేకుంటే ఇంత పెద్ద కార్యాన్ని తలపెట్టేవాడు కాదు.ఇది ఆయన స్వరమే అని నిశ్చయత ఉండేది కాదు. అనుదినం దేవుని మాట వినే అలవాటు లేనివారు ఎవ్వరూ కూడా దేవుని గొప్ప కార్యాల్లో పాలుపంచు కోలేరు అనేది సుస్పష్టం.తను నమ్మిన మాటకు బాహ్యంగా ఏ రుజువులు కనిపించక పోయినా ఓడ కట్టడం మొదలు పెట్టాడు. జంతువులన్ని జతలు ఓడలో ప్రవేశించడం చూసినా కూడా ప్రజలు దేవుణ్ని లక్యపెట్టలేదు. విశ్వాసం ఏ రుజువులు కనిపించక పోయినా నమ్మగలిగితే, అవిశ్వాసం కళ్ళ ముందు సాక్షాలు చూస్తున్నా నమ్మలేదు(లూకా 16:31).
✔ భూమి అంతా నాశనమైపోతుంది, ఒక్క ఓడలోని వారే కాపాడబడతారని తెలియగానే నోవాహు తన ఇంటివారితో కలిసి శ్రమపడుతూ ఓడను కట్టే ఆ పనిలో ఉన్నాడు. ఇది దేవుడు ఆదేశించిన పని. అదే సమయంలో మిగిలిన వారు ఎలాంటి పనుల్లో తనమునకలై ఉండేవారో ఊహించండి!తినుచూ, త్రాగుచూ, వ్యర్ధమైన వాటికోసం ప్రయసపడుతూ, వారి నాశనానికి సిద్ధపడుతున్నారు(మత్తయి 24:37,38). కడవరి రోజులు నోవహు రోజుల్లోలనే ఉంటాయి. స్నేహితుడా! నీ ప్రయాస దేనికోసం? నీవు విశ్వాసివి అయ్యుంచొచ్చు కానీ, నీ ప్రాధాన్యతల్లో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? మొదట దేవునికి స్థానం ఇవ్వు! (అంటే అబ్రాహాము ప్రేమించిన ఇస్సాకును బలిపీఠంపై పెట్టినట్లు). నేడు దేవుడు కోరే పని మొదట నీలో క్రీస్తు రూపం (రోమా 8:29). క్రీస్తులో ప్రతి ఆత్మీయ ఆశీర్వదం దేవుడు మనకు అనుగ్రహించాడు(ఎఫెస్సి 1:3). వాగ్ధానాలను ఆసక్తితో, విశ్వాసంతో నీవు స్వంతం చేసుకోవాలి. అప్పుడు క్రీస్తు మనస్సు కలిగి నశించుపోతున్న ఆత్మల పట్ల భారాన్ని పుట్టిస్తుంది.
(క్రీస్తు స్వభావం మనలో రూపాంతరానికి మనసివ్వకుండా కూడా సేవ చెయ్యొచ్చు.అలా చేసే అనేక మంది సేవకుల్లో/విశ్వాసుల్లో ఆత్మలో శూన్యతకు కారణం అదే! ఎఫెస్సు సంఘ పతనం ఇలాగే జరిగింది,ప్రకటన 2:2-5. ఇది మరవొద్దు!మొదట దేవుని పని నీలో ఆరంభం అవ్వాలి, అది జరుగుతూ ఉండాలి)
ఒకరోజు దేవుడు నోవహుతో౼"మనుషుల దౌర్జన్యన్ని బట్టి నా సముఖం నుంచి వారిని, ప్రతి శరీరి నిర్మూలమైపోబోతుంది. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో...నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను.
అయితే నేను నీతో నా నిబంధన చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి వెళ్ళాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి జాతిలో మగది, ఆడది బ్రతికునట్లు అవి నీ దగ్గరికి వస్తాయి" ❇
✔ దేవునికి విసుగు పుట్టించిన మనుష్యులతో నీతిమంతుడైన నోవహు ఎలాంటి భాధలు పడుతూ బ్రతికి ఉంటాడో ఉహించండి. ఒకవేళ వారిలో ఒకడైతే సమస్యే ఉండదు కానీ లోకానికి వేరుగా జీవించి దేవునితో నడిచే వ్యక్తియైతే(odd man out) ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. అతను ఎగతాళి చేయబడతాడు, ఒంటరైపోతాడు, నిందలు పడతాడు. అతన్ని కానీ, అతని మాటల్ని కానీ ఎవ్వరూ లక్యపెట్టలేదు.కానీ నోవాహు లోకపోకడను చులకనగా చూసి, దేవునిలోని సంతోషాన్నే అమితంగా లక్యపెట్టాడు.ఈ విధంగా నోవహు లోకంపై నేరం మోపాడు లేఖనాలు చెప్తున్నాయి (హెబ్రీ 11:7).
✔ కనుకనే దేవుని దృష్టిలో కూడా ప్రత్యేకి అయ్యాడు. ఆ ఒక్కనితోనే దేవుడు మాట్లాడాడు. నోవహు దేవుని స్వరం అనుదినం వినే అనుభవం లేకుంటే ఇంత పెద్ద కార్యాన్ని తలపెట్టేవాడు కాదు.ఇది ఆయన స్వరమే అని నిశ్చయత ఉండేది కాదు. అనుదినం దేవుని మాట వినే అలవాటు లేనివారు ఎవ్వరూ కూడా దేవుని గొప్ప కార్యాల్లో పాలుపంచు కోలేరు అనేది సుస్పష్టం.తను నమ్మిన మాటకు బాహ్యంగా ఏ రుజువులు కనిపించక పోయినా ఓడ కట్టడం మొదలు పెట్టాడు. జంతువులన్ని జతలు ఓడలో ప్రవేశించడం చూసినా కూడా ప్రజలు దేవుణ్ని లక్యపెట్టలేదు. విశ్వాసం ఏ రుజువులు కనిపించక పోయినా నమ్మగలిగితే, అవిశ్వాసం కళ్ళ ముందు సాక్షాలు చూస్తున్నా నమ్మలేదు(లూకా 16:31).
✔ భూమి అంతా నాశనమైపోతుంది, ఒక్క ఓడలోని వారే కాపాడబడతారని తెలియగానే నోవాహు తన ఇంటివారితో కలిసి శ్రమపడుతూ ఓడను కట్టే ఆ పనిలో ఉన్నాడు. ఇది దేవుడు ఆదేశించిన పని. అదే సమయంలో మిగిలిన వారు ఎలాంటి పనుల్లో తనమునకలై ఉండేవారో ఊహించండి!తినుచూ, త్రాగుచూ, వ్యర్ధమైన వాటికోసం ప్రయసపడుతూ, వారి నాశనానికి సిద్ధపడుతున్నారు(మత్తయి 24:37,38). కడవరి రోజులు నోవహు రోజుల్లోలనే ఉంటాయి. స్నేహితుడా! నీ ప్రయాస దేనికోసం? నీవు విశ్వాసివి అయ్యుంచొచ్చు కానీ, నీ ప్రాధాన్యతల్లో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? మొదట దేవునికి స్థానం ఇవ్వు! (అంటే అబ్రాహాము ప్రేమించిన ఇస్సాకును బలిపీఠంపై పెట్టినట్లు). నేడు దేవుడు కోరే పని మొదట నీలో క్రీస్తు రూపం (రోమా 8:29). క్రీస్తులో ప్రతి ఆత్మీయ ఆశీర్వదం దేవుడు మనకు అనుగ్రహించాడు(ఎఫెస్సి 1:3). వాగ్ధానాలను ఆసక్తితో, విశ్వాసంతో నీవు స్వంతం చేసుకోవాలి. అప్పుడు క్రీస్తు మనస్సు కలిగి నశించుపోతున్న ఆత్మల పట్ల భారాన్ని పుట్టిస్తుంది.
(క్రీస్తు స్వభావం మనలో రూపాంతరానికి మనసివ్వకుండా కూడా సేవ చెయ్యొచ్చు.అలా చేసే అనేక మంది సేవకుల్లో/విశ్వాసుల్లో ఆత్మలో శూన్యతకు కారణం అదే! ఎఫెస్సు సంఘ పతనం ఇలాగే జరిగింది,ప్రకటన 2:2-5. ఇది మరవొద్దు!మొదట దేవుని పని నీలో ఆరంభం అవ్వాలి, అది జరుగుతూ ఉండాలి)
Comments
Post a Comment