❇ మరియ-యోసేపులు బేత్లెహేములో ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని,పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...." వారు త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ అందరికీ ప్రకటించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. (లూకా 2:6-18) ❇ జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ హేరోదు రాజు అంతఃపురంలోకి వెళ్లారు. వారు జ్ఞానులు కనుక అక్కడ ప్రవేశం దొరికింది! అదే అంతఃపురంలో లోకం చేత హీనంగా చూడబడే చదువులేని గొఱ్ఱెల కాపరులను అక్కడికి అనుమతించగలరా? క్రీస్తు సర...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.