❇ మరియ-యోసేపులు బేత్లెహేములో ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని,పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...."
ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...."
వారు త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ అందరికీ ప్రకటించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. (లూకా 2:6-18) ❇
జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ హేరోదు రాజు అంతఃపురంలోకి వెళ్లారు. వారు జ్ఞానులు కనుక అక్కడ ప్రవేశం దొరికింది! అదే అంతఃపురంలో లోకం చేత హీనంగా చూడబడే చదువులేని గొఱ్ఱెల కాపరులను అక్కడికి అనుమతించగలరా? క్రీస్తు సర్వ మానవాళికీ రక్షకుడు కనుక అత్యంత అల్పులుగా పిలువబడే ప్రజలు కూడా ఆయన్ను సమీపించగల ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆయన్ను సమీపించాలంటే దీనుల వలె తమను తాము తగ్గించుకున్నవారే ఆయన్ను చూడగలరు. దేవుని కుమారుని జన్మదిన సువర్తమానానికి మొదటి ఆహ్వానం తీసుకున్నవారిని గమనించారా(గొఱ్ఱెల కాపరులు)! కశ్చితంగా ఆయన రాక కోసం ఆశతో కనిపెట్టే ప్రజలనే నిస్సానందేహంగా చెప్పవచ్చు. వారు తమ గొఱ్ఱెలను విడిచి తమను జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుని నమ్మకానికి తగినట్లుగా ప్రవర్తించారు. గొఱ్ఱెలు కాపరులు శిశువైన క్రీస్తును గూర్చి ప్రకటించుకుంటూ, దేవుణ్ని స్తుతిస్తూ వెళ్లారు. పరలోకం నుండి ఆ సువర్తమాన సందేశం దేవదూతలు మోసుకొచ్చినా, ఈ లోకానికి అందించడానికి అత్యంత సామాన్యులకు ప్రభువు అప్పగించాడు. ఏ మనిషీ గొప్పలకు పోకుండా ఇప్పటికీ దేవుడు అవలంభిస్తున్న విధానం ఇదే!క్రీస్తు రాకతో, మురికిగా ఉన్న ఆ పశువుల పాకలోకి పరలోక మహిమ దిగి వచ్చింది!నేడు అసహ్యమైన పాపపు మురికితో ఉన్న హృదయాల్లోకి కృపతో ప్రవేశించి పరలోక మహిమను నింపగల సమర్థుడు యేసు దేవుడు! ఎవరి హృదయంలోకి క్రీస్తు ఆత్మ స్వరూపిగా వస్తాడో, ఎవరి హృదయంలో ప్రముఖునిగా పరిపాలన చేస్తాడో..అదే క్రిస్మస్ కు నిజమైన, పరిపూర్ణమైన అర్ధం!
___________________________________
For more posts visit below links
https://www.facebook.com/kristop4
https://kristop4.blogspot.com
___________________________________
For more posts visit below links
https://www.facebook.com/kristop4
https://kristop4.blogspot.com
Comments
Post a Comment