Skip to main content

30Sep2017

❇ యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి రాగా దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు.
అక్కడ 40 రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు గనుక ఆయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు....

● సాతాను ఆయనతో౼"నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు.
యేసు౼"మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది" 

 ✔ 40 రోజుల క్రిందట దేవుడు-యేసును గూర్చి'ఈయనే నా ప్రియమైన కుమారుడు' అని సాక్ష్యం పలికాడు. ఆ మాటతోనే మొదలు పెడుతూ సాతాను ఆయన్ను శోధించడం మనం గమనించవచ్చు. అపవాది యేసులోని దైవత్వం నిరూపించు కొమ్మని అడిగితే, సాత్వికుడైన యేసు తను తాను మానవుని
(మనుష్యుడు)గా బదులు పలుకుతున్నాడు. ఏదేనులో దేవతల వలె ఉంటారన్న సాతాను అబద్ధపు ప్రలోభాలకు మొదటి మనుష్యులు పూర్తిగా లోబడ్డారు. వారు ఆత్మకంటే శరీరాన్ని, భూసంభందమైన సౌఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ యేసు తన శరీర ఆకలిదప్పుల కృశించి పోతున్నప్పటికి దేవునితో సంభంధం కలిగి ఉండటాన్నే విలువైనదిగా ఎంచాడు.

ఆ తర్వాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి౼"నీవు దేవుని కుమారుడివయితే కిందికి దూకు! 'ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు' అని రాసి ఉంది గదా!"
అయితే యేసు౼" 'నీ దేవుడైన ప్రభువుకు పరీక్ష పెట్టకూడదని' మరొక చోట రాసి ఉందని" జవాబిచ్చాడు

✔ నేడు మనకు కనిపించే తప్పుడు సిద్దాంతాలు సాతాను చేత వక్రీభించబడినవే! మరొక చోట ఇలా వ్రాయబడింది అని యేసు చెప్పిన వాక్యంతో సాతాను వక్రీభించిన వాక్యంకు సంపూర్ణమైన సరైన అర్ధం దొరికింది. నిజానికి సాతాను క్రీస్తును ఆత్మహత్యకు ప్రేరేపించాడు. దేవాలయం పైనుంచి దిగడానికి మెట్లు ఉంటే.. దూకటం ఎందుకు?(డాక్టర్లు, మందులను దేవుడు ఇస్తే దేవుడే నయ్యం చేస్తాడని తప్పుగా ఆపాదించుకోవటం ఈలాంటిదే!). ఆయన తనంతట తాను ఏమి చెయ్యలేదు, మాట్లాడలేదు కానీ తండ్రి సెలవిచ్చిన ప్రతి మాటను, పనిని మాత్రమే జరిగించాడు.

మళ్ళీ సాతాను చాలా ఎత్తయిన ఒక కొండపైకి ఆయన్ని తీసుకుపోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్నీ ఆయనకు చూపించి౼"నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను" అన్నాడు.
యేసు౼"సాతానా! అవతలికి పో! 'ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్ని మాత్రమే సేవించాలి' అని రాసి ఉంది" అన్నాడు.

✔ అపవాది చేసే ప్రతి శోధన వెనుక ఉద్దేశ్యం౼మనం వాడి మాటకు లోబడాలని, దేవుని మాట మీద అపనమ్మిక ఉంచాలని, మనల్ని ఆయన్నుండి దూరం చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందుకోసం దేవుని కుమారునికి సైతం లోక సుఖాలను ఎరగా వేస్తే, మనల్ని మరెంతగా ఈ విషయంలో శోధించవచ్చో ఊహించ వచ్చు. మానవుని పట్ల దేవుని ఉద్దేశ్యాలను యేసు సుస్పష్టంగా తన జవాబులో చెప్తున్నాడు. నరుడుగా ఆయన అలాగే జీవించాడు.

■ మన జీవితంలో సాతాను మనల్ని చేజిక్కిచుకోవాలని చూపే ప్రతి జిత్తులను, వాడి తంత్రాలను కనిపెట్టగలమని వాక్యం బోధిస్తుంది. నేటి చిన్న బిడ్డలే, తండ్రులుగా-వృద్ధులుగా వయస్సులో పరిణతి చెందినట్లే, ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచే అనుభవాలే పాఠాలుగా, ఒడిదుడుకులే బలమైన వారిగా తయారవ్వడానికి దేవుడు వాడుకుంటాడు.మన పక్షాన యుద్ధం చేయు దేవుడే ఆసక్తి పరులకు ప్రతి పాఠం భోధిస్తాడు.తన బిడ్డలను (ఆత్మీయ)తండ్రులు కాపాడుకోవడం వారి బాధ్యత అని మనకెవ్వరూ భోధించనక్కరలేదు కదా!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...