Skip to main content

09Sep2017


❇ మోషే సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ దేవునితో ఉన్నాడు. ఆ సమయంలో కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. అప్పుడు ప్రజలు౼"ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే" అన్నారు. అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు౼"రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది" అంటూ ప్రకటన చేశాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు. శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారు. దేవుని కోపం వారిపై రగులుకొన్నది. ❇
✔ ప్రజలు యెహోవా పేరునే మ్రొక్కారు౼బలులు అర్పించారు. తర్వాత తమకు నచ్చినట్లు ఆడారు. వీరికి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యమంటున్నాడో పనిలేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నట్లేతే వాటిని సైతం వారి కోరికలకు తగినట్లు అన్వయించుకునే వారు. నేడు ఈ వైఖరి సంఘాల్లో, సహవాసాల్లో కనిపించట్లేదా? ప్రజలను భావోద్రేకాలతో (emotions) చేసే భక్తిని ప్రోత్సహించే అహరోను లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. వారి మనసుకు ఉల్లాసం కలిగిచే భావోద్రేకాలతో కూడిన కార్యకలాపాలు..పాటలు, సంగీతం, వాయిద్యాలు, activities ద్వారా పొందే ఉద్రేకం, తన్మయత్వం ఆ స్థలం వరకే పరిమితమౌతుంది. వారి దైనందిక జీవితం షరా మామూలే! ఆత్మను రూపాంతరం చేయనిది, దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్లని భక్తి..ఏం భక్తి అది? వారి వ్యక్తిగత జీవితాల్లో దేవునికి స్థానం ఉండదు. చెడిపోయిన పాశ్చాత్య సంస్కృతి సంఘాల్లో ప్రవేశించి ఆత్మతో, సత్యంతో చెయ్యవల్సిన ఆరాధనను కల్తీ చేస్తున్నాయి. వింత ఆకారాలతో, వస్త్రధారణతో సాతాను ప్రతినిధులగా పనిచేసే Rock stars, భావోద్రేకాలతో నడిపే ఆరాధనలతో సంఘాలు భ్రష్టు పడిపోతున్నాయి.(అలా ఉన్న మీ బిడ్డలను చూసి పొంగిపోతున్నారా? దేవునితో సంభంధం లేని ఉగ్రతపాత్రులుగా ప్రోత్సహించవద్దు. దేవుని ముందు లెక్కచెప్పుకోవాల్సిన సమయం వస్తుంది). పేరు దేవునిదే కానీ దేవుని చెందినది కాదు. ఇది కొండ క్రింద ఇశ్రాయేలీయులు చేసిన భక్తి.
✔ కొండపై దేవునితో గడిపిన మోషే జీవితాన్ని గమనించారా! దేవుడు ఏం చెప్తున్నాడో శ్రద్ధగా ఆలకించే జీవితం. ఆకలి దప్పులతో 40 దినాలు గడుస్తున్నా దేవునిలోనే ఆనందించే జీవితం. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం..ఆత్మలో దేవుణ్ని నిండు మనస్సుతో కోరుకున్న భక్తి. ఇదే కదా దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది. మనకేలా ఇష్టమైనది కాదు..దేవుడు మనల్ని ఏమి చెయ్యమంటున్నాడు అనేదే ముఖ్యం(లూకా 10:38-41)
మోషే క్రిందికి వచ్చి వారిని చూచినప్పుడు అహరోనుకు రాని కోపం మోషేకు వచ్చింది. కారణం..మోషే దేవునికి దగ్గరగా వుండే వ్యక్తి. సరిగ్గా దేవుని వలె ప్రవర్తించాడు. ప్రజల దృష్టిలో అహరోను శాంతి దూత. మోషే కోపిష్టి. కానీ దేవుని దృష్టిలో మోషే (ఇల్లంతటిలో) నమ్మకమైన వాడు. అహరోను దేవుని వలె ప్రవర్తించలేని అసమర్ధుడైన నాయకుడు. నేడు సంఘాల్లో, సహవాసాల్లో కూడా ఇదే జరుగుతుంది.
౼ నీవు ప్రజల ముందు శాంతి దూతగా ఉంటావా? లేక ప్రజలను దేవునితో సమాధానపరిచే దేవుని ప్రతినిధిగా ఉంటావా? ఐతే క్రీస్తు, అపొస్తలులు మార్గంలో ప్రయాణం చేస్తావు.
యేసు తన సహోదరులతో౼"లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది"(యోహాను 7:7)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...