Skip to main content

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు.
యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.
యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు.
అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు.
అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇
■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అనుమతి లేదు. మేము అనుమతి ఇవ్వందే నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు. నువ్వు మాకు(పెద్దల అధికారానికి) లోబడాలి. మేం చెప్పినట్లే వినాలి. మాలో ఎవ్వరి అధికారం క్రింద నీవు ఉన్నావ్?"
యేసు తిరిగి ప్రశ్నిస్తూ బాప్తిస్మమిచ్చే యోహాను అందరికి బాప్తిస్మము ఇచ్చాడు..అతనికి అధికారం/అనుమతి మీలో ఎవరి దగ్గరైనా దొరికిందా! లేక దేవుడే ఇచ్చాడా?
"మనుష్యుల" దగ్గర నుండి అధికారం౼"దేవుని" దగ్గర నుండి అధికారం అనే రెండు విషయాలు కనిపిస్తున్నాయి.
■ అత్యున్నత సింహాసనంపై ఆశీనుడయున్న దేవుని దగ్గర ఒక అధికారం ఉంది,అది అన్ని భూఅధికారాలన్నిటి కంటే ఉన్నతమైనది, శాశ్వితమైనది.ఈ రోజు కనిపించి, రేపు కనిపించ కుండా పోయే అశాశ్వితమైన, రక్తమాంసాలు కలిగిన మనుషులు ఇచ్చే అధికారం కోసం, వారి మన్నన కోసం మనుషులు పడే ఆత్రం అంత ఇంత కాదు. మరి సర్వోన్నతుడు నియమించిన నియామకం మరి ఇంకెంత గొప్పది.దీనిని అందరూ గుర్తించలేరు గానీ దేవుణ్ని ఆత్మలో చూచేవారు మాత్రమే గుర్తుపట్టగలరు. పై ఉదాహరణల ఆధారంగా ఈ లోక అధికారానికి(మాత్రమే) వంగి, వంగి లోబడేవారికి, దేవుని చేత నేరుగా అధికారం పొందిన వారిని అంగీకరించక, ఎదురాడతారనేది సుస్పష్టం.
■ బాప్తిస్మమిచ్చే యోహానుకు కలిగిన అధికారం అతని పుట్టుకకు ముందే దేవుని దగ్గర నుండి కలిగింది(లూకా 1:14-17).అతన్ని కూడా ఈ గుంపు ఇలానే ప్రశ్నించింది(యోహా 1:25).యేసు వడ్రంగిగా తన శాలలో పని చేస్తున్నప్పుడు దేవుని పిలుపు ఆయన సేవకై పిలుచుకుని నియమించాడు. క్రీస్తు తండ్రియైన దేవుని అధికారం క్రింద ఎల్లప్పుడూ లోబడి
ఉన్నవాడు(యోహా 19:11). అపొస్తలుడైన పౌలు తన నియామకం మనుషుల వలన కలిగింది కాదు సాక్ష్యాత్తు దేవుని నుండే కలిగిందని తెలియపర్చుకున్నాడు(గలతి 1:1). అలాగే దేవుని అధికారం క్రింద ఉన్న దైవనాయకులు దేవుని ఆత్మ చిత్తానుసారంగా నియామకాలను కొనసాగించారు (అ.కా13:1-3). ఇది దేవుని నుండి కలిగే అధికారం.సహజంగా లోకరీత్యా ఆలోచించే వాడు గుర్తుపట్టలేని వారికే దేవుడు ఇస్తాడు(1 కోరింధి 1:26-29).
■ మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా నియమించిన వ్యక్తిని ఎదురురాడితే వారి పక్షాన వత్తాసు పలుకుతారు కదా!అలాగే దేవుని చేత నియమించబడిన అధికారానికి మనుష్యులు ఎదురాడితే కూడా దేవుడు కలుగజేసుకుంటాడు(అ.కా 5:39). కానీ ఆయన, ఆయన సమయంలోనే పని చేస్తాడు.
౼"మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించిన వాడు ఎవడ"ని ఇశ్రాయేలీయులు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు(అ.కా 7:35).
(దయచేసి పైన వ్రాసిన రిఫరెన్స్ చదవండి)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...