Skip to main content

14Oct2017

❇ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. వారి ముందు ఇశ్రాయేలీయులు నిలువలేక పారిపోయారు.చాలా మంది సైనికులు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. రాజైన సౌలు యొక్క ముగ్గురు కుమారులను అతని కళ్ళ ముందే చంపారు. ఇది చూసి అప్పటికే బాగా గాయపడిన సౌలు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిష్తీయులు సౌలు తలను ఛేదించి దాగోను దేవుడి గుడిలో తగిలించారు. అతని మొండాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఇలా దేవుని చేత అభిషేకించబడిన రాజైన సౌలు జీవితం విషాదంతో ముగిసింది.
సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి, దేవుని దృష్టి యెదుట ద్రోహము చేశాడు. అంతేకాకుండా దేవుని దగ్గర కనిపెట్టకుండా కర్ణపిశాచముల సహాయంతో సోదె చెప్పె దానిని వెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కారణాలను బట్టి దేవుడు అతనికి మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను.(1దిన 10) ❇
✔ ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయులను తరిమి తరిమి చంపారు(1సమూ 17:52). శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన ప్రతిసారీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. కారణం దైవభయం కలిగిన శూరుడైన దావీదు. దేవుని యెదుట సుబుద్ధి కలిగిన ఒక్క వ్యక్తి ప్రభావం, ఆ దేశం అంతటిపైనా కనిపించింది. అలాగే ఒక వ్యక్తి (సౌలు) యొక్క అవిధేయత కూడా అనేకుల పతనానికి కారణమైయ్యింది. దావీదు ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుడు, శూరుడైన గోల్యతును చంపి ఇశ్రాయేలు రాజ్యాన్ని రక్షించాడు. తన స్థానం ఎక్కడ ఆక్రమిస్తాడోనని, అప్పట్నుంచి సౌలు దావీదుపై విషపు చూపు చూస్తూ చంపాలని ప్రయత్నిస్తూనే వచ్చాడు. సౌలు దేవుని చేత అభిషేకం చెయ్యబడిన రాజు అనే కారణాన్ని బట్టి దావీదు సుబుద్ధితో అవకాశం వచ్చినా ఏ హాని చెయ్యలేదు (నిజానికి దేవుడు దావీదును కూడా తర్వాతి రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు దేవునికి బయపడక దావీదుకు హాని చెయ్యాలని చూశాడు). దేవుడు తనను విడిచాడని, దావీదును తోడై ఉన్నాడని తెల్సినా కూడా సరిచేసుకోలేదు. సౌలు మనస్సును కఠినం చేసుకొన్నాడు. అనేక సంవత్సరాలు దేవుడు అతనికి అవకాశాలను ఇచ్చినా బుద్ధిపూర్వకంగా త్రోసిపుచ్చి, అవిధేయుడై దెయ్యాపు శక్తిని ఆశ్రయించాడు.
✔ "దేవుడు సౌలుకు మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను" (10:14). పై వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే..
దేవుడు అన్ని అధికారాల కంటే పైన ఉన్నత సింహాసనంపై తన అధికారాన్ని స్థాపించాడని, ఆయనే మనుషులను ఉంచేవాడు, తొలగించే వాడనే సత్యం గ్రహించవచ్చు. కానీ సౌలు తన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోన్నాడు. తన స్వశక్తితో దాన్ని నిలుపుకోవాలని అనుకున్నాడు. దావీదునకు అధికారం దేవుని నుండి వచ్చింది. కానీ దేవుని మనస్సులేని మనుష్యులు అతన్ని అధికార దాహం కలవాడని నిందించారు(2సమూ 16:8). దావీదు అధికారం కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు. కానీ దేవుని అధికారానికి తనను తాను నమ్మకంగా అప్పగించుకొన్నాడు. ఆయనదైన సమయంలో దేవుడు దావీదునకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. ఒకవేళ తప్పు చేసినా(దేవుడు శిక్షించినా), శ్రమలోనూ, సంతోషంలోనూ దావీదు దేవుని సన్నిధి నుండి ఎన్నడూ ఎదురాడలేదు, తొలగిపోలేదు, గానీ చిరకాలం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనే కోరుకున్నాడు. కనుకనే నేటికి దేవుని హృదయంలో దావీదుకు ప్రత్యేకమైన చోటు ఉంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...