❇ సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి...
ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి ౼"ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో వచ్చాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు." అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు పడ వేశారు (ప్రకటన 4:4,10,11).
దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు౼"ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా..."(ప్రకటన 11:16). ❇
✔ కొన్ని కోట్ల మంది విశ్వాసులు లోకం నుండి వేరై, దేవుని యందు విశ్వాసముంచి దేవుని పక్షంగా నిలిచారు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను ఇరవై నలుగురు పెద్దలను ప్రత్యేకంగా దేవుని సింహాసనం యెదుట చూశాడు. వారు కిరీటాలు ధరించి ఉన్నారు. యోహాను చూసిన ప్రతిసారి ఆ ఇరవై నలుగురు పెద్దలు దేవుణ్ని ఆరాధించినట్లు వ్రాయబడింది(ప్రకటన 5:8-9, 19:4). వీరు ఎందుకని దేవునికి ప్రత్యేకులయ్యారు?
నేను నమ్ముతున్నాను, వారు భూమిపై ఉన్నప్పుడు ఏమి చేశారో పరలోకంలో కూడా అదే చేస్తున్నారు. వారు దేవున్ని నిత్యం ఆరాధించిన వారు. అంటే రోజు ఎక్కువ సమయం
"స్తుతి-స్తుతి-స్తుతి, హల్లెలుయా-హల్లెలుయా-హల్లెలుయా స్తోత్రం-స్తోత్రం-స్తోత్రం" అని పలికేవారా? ఖచ్చితంగా కాదు.
లేక బైబిల్లోని దేవుని లక్షణాలను(కొన్ని స్తుతి పుస్తకాలను), స్తోత్రాలుగా వల్లె వేసేవారా? కాదు.
అలా చేసే వారు భక్తిపరులుగా ఉంటారని భ్రమపడకండి. ఆరాధన అంటే అది కాదు. బైబిల్లో అబ్రాహాము గొప్ప ఆరాధికునిగా కనిపిస్తాడు. ఆయన వెళ్లిన ప్రతిచోటా ఒక బలిపీఠం కట్టి దేవుణ్ని ఆరాధించాడు. అలా చేసిన ప్రతిసారి దేవుని లక్షణము ఒకటి తన జీవితంలో అనుభవపూర్వకంగా తెల్సుకొని ఆరాధించాడు. ఆరాధన జీవితంలో నుండి, హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ని రుచి చూసినప్పుడు అనురాగ పూర్వకంగా వచ్చే మాటలు.
✔ దాని తేడాను నీవ్వే గమనించగలవు. నీవేప్పుడైన విశ్వాసంతో దేవుణ్ణి (కనుపర్చుకోమని, నేర్పించమని, విడిపించమని) ఏదైన విషయంలో ప్రార్ధించావా?అప్పుడు దేవుని గొప్ప హస్తం నిన్ను ఆదుకొన్నప్పుడు/ఆదరించినప్పుడు/నేర్పించినప్పుడు.. ఆయన నిన్ను చూస్తూ, నీకు దగ్గరగా ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది. వాక్యంలోని దేవుణ్ణి నీ జీవితంలో దగ్గర నుండి అనుభవాల ద్వారా చూసినప్పుడు నీ హృదయం స్తుతితో, ఆరాధన భావంతో నిండిపోతుంది. అప్పుడు హృదయపూర్వకంగా దేవునికి చేసిన ఆరాధనకు(స్తుతికి), మిగితా సమయంలో పలికే మాటలకు తేడా గమనించండి. దేవుడు కోరుకునే ఆరాధన సత్యంతో, ఆత్మలో నుండి పలికే మాటలు.(బైబిల్లోని దేవుని స్వభావం గూర్చి మనం విన్నప్పుడు మనం ఆరాధించడాన్ని నేను చులకన చేయట్లేదు కానీ అది మన జీవితంలో ఒక అనుభవంగా మారాలనే కోరిక మనకుండాలని మాత్రమే చెప్తున్నాను. వట్టి మాటలుగా మిగిలిపోకూడదు). బైబిల్లోని విశ్వాసులు వారి పితరులతో నడచిన దేవుణ్ని కొనియాడారు..అలాగే అదే దేవునితో వారికి కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా వారు దేవుణ్ని ఆరాధించారు. నేడు మనం కూడా అలాగే ఉండాలి.వాక్యంలోని మాటలతో ఆగిపోకూడదు. నీకు దేవుని అనుభవాలు ఉండాలి.
నిజమైన ఆరాధికులు జీవితంతో, వారి అనుభవాల ద్వారా, నిందలో, శ్రమలో, లేమితో, సంతోషంలో అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ ఆరాధికులుగానే ఉంటారు. వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు
ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి ౼"ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో వచ్చాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు." అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు పడ వేశారు (ప్రకటన 4:4,10,11).
దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు౼"ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా..."(ప్రకటన 11:16). ❇
✔ కొన్ని కోట్ల మంది విశ్వాసులు లోకం నుండి వేరై, దేవుని యందు విశ్వాసముంచి దేవుని పక్షంగా నిలిచారు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను ఇరవై నలుగురు పెద్దలను ప్రత్యేకంగా దేవుని సింహాసనం యెదుట చూశాడు. వారు కిరీటాలు ధరించి ఉన్నారు. యోహాను చూసిన ప్రతిసారి ఆ ఇరవై నలుగురు పెద్దలు దేవుణ్ని ఆరాధించినట్లు వ్రాయబడింది(ప్రకటన 5:8-9, 19:4). వీరు ఎందుకని దేవునికి ప్రత్యేకులయ్యారు?
నేను నమ్ముతున్నాను, వారు భూమిపై ఉన్నప్పుడు ఏమి చేశారో పరలోకంలో కూడా అదే చేస్తున్నారు. వారు దేవున్ని నిత్యం ఆరాధించిన వారు. అంటే రోజు ఎక్కువ సమయం
"స్తుతి-స్తుతి-స్తుతి, హల్లెలుయా-హల్లెలుయా-హల్లెలుయా స్తోత్రం-స్తోత్రం-స్తోత్రం" అని పలికేవారా? ఖచ్చితంగా కాదు.
లేక బైబిల్లోని దేవుని లక్షణాలను(కొన్ని స్తుతి పుస్తకాలను), స్తోత్రాలుగా వల్లె వేసేవారా? కాదు.
అలా చేసే వారు భక్తిపరులుగా ఉంటారని భ్రమపడకండి. ఆరాధన అంటే అది కాదు. బైబిల్లో అబ్రాహాము గొప్ప ఆరాధికునిగా కనిపిస్తాడు. ఆయన వెళ్లిన ప్రతిచోటా ఒక బలిపీఠం కట్టి దేవుణ్ని ఆరాధించాడు. అలా చేసిన ప్రతిసారి దేవుని లక్షణము ఒకటి తన జీవితంలో అనుభవపూర్వకంగా తెల్సుకొని ఆరాధించాడు. ఆరాధన జీవితంలో నుండి, హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ని రుచి చూసినప్పుడు అనురాగ పూర్వకంగా వచ్చే మాటలు.
✔ దాని తేడాను నీవ్వే గమనించగలవు. నీవేప్పుడైన విశ్వాసంతో దేవుణ్ణి (కనుపర్చుకోమని, నేర్పించమని, విడిపించమని) ఏదైన విషయంలో ప్రార్ధించావా?అప్పుడు దేవుని గొప్ప హస్తం నిన్ను ఆదుకొన్నప్పుడు/ఆదరించినప్పుడు/నేర్పించినప్పుడు.. ఆయన నిన్ను చూస్తూ, నీకు దగ్గరగా ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది. వాక్యంలోని దేవుణ్ణి నీ జీవితంలో దగ్గర నుండి అనుభవాల ద్వారా చూసినప్పుడు నీ హృదయం స్తుతితో, ఆరాధన భావంతో నిండిపోతుంది. అప్పుడు హృదయపూర్వకంగా దేవునికి చేసిన ఆరాధనకు(స్తుతికి), మిగితా సమయంలో పలికే మాటలకు తేడా గమనించండి. దేవుడు కోరుకునే ఆరాధన సత్యంతో, ఆత్మలో నుండి పలికే మాటలు.(బైబిల్లోని దేవుని స్వభావం గూర్చి మనం విన్నప్పుడు మనం ఆరాధించడాన్ని నేను చులకన చేయట్లేదు కానీ అది మన జీవితంలో ఒక అనుభవంగా మారాలనే కోరిక మనకుండాలని మాత్రమే చెప్తున్నాను. వట్టి మాటలుగా మిగిలిపోకూడదు). బైబిల్లోని విశ్వాసులు వారి పితరులతో నడచిన దేవుణ్ని కొనియాడారు..అలాగే అదే దేవునితో వారికి కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా వారు దేవుణ్ని ఆరాధించారు. నేడు మనం కూడా అలాగే ఉండాలి.వాక్యంలోని మాటలతో ఆగిపోకూడదు. నీకు దేవుని అనుభవాలు ఉండాలి.
నిజమైన ఆరాధికులు జీవితంతో, వారి అనుభవాల ద్వారా, నిందలో, శ్రమలో, లేమితో, సంతోషంలో అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ ఆరాధికులుగానే ఉంటారు. వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు
Comments
Post a Comment